News October 25, 2024
అప్పుడు క్రాస్ ఓటింగ్కు పాల్పడ్డ జీషన్ సిద్ధిఖీ

మహారాష్ట్రలో గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున గెలిచిన మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ కుమారుడు జీషన్ సిద్ధిఖీ జులైలో జరిగిన MLC ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్కు పాల్పడ్డారు. దీంతో విపక్ష MVA కూటమి అభ్యర్థి ఓడిపోవడంతో కాంగ్రెస్ జీషన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ముందు నుంచి NCP అజిత్ పవార్ వర్గంతో టచ్లో ఉన్న జీషన్ ఎన్నికల ముందు ఊహించినట్టుగానే ఆ పార్టీలో చేరి టికెట్ పొందారు.
Similar News
News December 13, 2025
అఖండ-2.. తొలిరోజు రూ.59.5 కోట్ల కలెక్షన్లు

బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన అఖండ-2 సినిమా బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది. ప్రీమియర్స్తో కలిపి తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.59.5 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లు మేకర్స్ వెల్లడించారు. బాలయ్య కెరీర్లో ఇవే బిగ్గెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్లు అని తెలిపారు. నిన్న విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చిన విషయం తెలిసిందే. ఆది పినిశెట్టి, సంయుక్త, హర్షాలీ కీలక పాత్రలు పోషించారు.
News December 13, 2025
NIT ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు

<
News December 13, 2025
ఈ వాతావరణం కనకాంబరం సాగుకు అనుకూలం

అధిక తేమ, వేడి కలిగిన ప్రాంతాలు కనకాంబరం సాగుకు అనుకూలం. మొక్క పెరుగుదలకు 30 నుంచి 35 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు ఉండాలి. చల్లని వాతావరణ పరిస్థితుల్లో పూల దిగుబడి అధికంగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు మరీ ఎక్కువగా ఉంటే పూలు లేత రంగుకు మారి నాణ్యత తగ్గుతుంది. మరీ తక్కువ ఉష్ణోగ్రతను కూడా మొక్క తట్టుకోలేదు. నీరు నిలవని అన్ని రకాల నేలలు, ఉదజని సూచిక 6 నుంచి 7.5 మధ్య ఉన్న నేలల్లో మంచి దిగుబడి వస్తుంది.


