News September 5, 2024

అప్పుడు కృష్ణం రాజు.. ఇప్పుడు ప్రభాస్ ‌రాజు

image

తెలుగు రాష్ట్రాల్లో వరదలు రావడంతో బాధితులను ఆదుకునేందుకు ప్రభాస్ రూ.2కోట్లు విరాళం ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రభాస్ ఇప్పుడే కాదు.. ఎప్పుడు విపత్తులు వచ్చినా విరాళమిచ్చేందుకు ముందుంటారు. అయితే ఆయన పెదనాన్న కృష్ణం రాజు కూడా తక్కువేం కాదు. ఆయన 1986లో తూ.గో, ప.గో జిల్లాల్లో వరదలు వచ్చినప్పుడు అందరికంటే ఎక్కువగా రూ.1.05లక్షలు డొనేట్ చేశారు. కృష్ణ, దాసరి, రాజేశ్‌ఖన్నా రూ.లక్ష చొప్పున ఇచ్చారు.

Similar News

News February 4, 2025

నేటి ముఖ్యాంశాలు

image

* AP: భారత్‌వైపే ప్రపంచ దేశాల చూపు: CM CBN
* ప్రైవేట్ స్కూళ్ల గుర్తింపు గడువు పొడిగింపు: లోకేశ్
* పద్మభూషణ్ నాలో ఇంకా కసిని పెంచింది: బాలకృష్ణ
* TG: కులగణనపై సలహాలు, సూచనలు స్వీకరించేందుకు సిద్ధం: మంత్రి పొన్నం
* కులగణన నివేదిక ఫేక్: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
* తెలంగాణలో 90 శాతం వెనుకబడిన వాళ్లే: రాహుల్ గాంధీ

News February 4, 2025

అప్పుడు రోహిత్.. ఇప్పుడు త్రిష

image

గత ఏడాది టీ20 వరల్డ్ కప్ గెలిచాక భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ గ్రౌండ్‌లో పడుకున్న ఫొటో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా అదే తరహాలో అండర్-19 WC గెలుచుకున్నాక త్రిష కప్ పట్టుకొని పడుకున్న ఫొటోను ముంబై ఇండియన్స్ షేర్ చేసింది. దీంతో పాటు 2024లో సెలబ్రేషన్స్ ఫొటోలను ఇతర ఫొటోలతో పోల్చింది. అప్పటి రోహిత్ సెలబ్రేషన్స్‌ను ఇప్పుడు త్రిష రీక్రియేట్ చేశారని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

News February 4, 2025

శ్రీవారి భక్తులకు అలర్ట్

image

AP: రేపు రథసప్తమి కావడంతో శ్రీవారి దర్శనానికి భక్తులను సర్వదర్శనంలో అనుమతిస్తామని TTD EO శ్యామలరావు తెలిపారు. ఉ.5.30కు సూర్యప్రభ వాహన సేవతో ఈ వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఉ.9-10 వరకు చిన్న శేష వాహన సేవ, ఉ.11-12 వరకు గరుడ వాహన సేవ, మ.1-2 వరకు హనుమంత వాహన సేవ, మ.2-3 వరకు చక్రస్నానం, సా.4-5 వరకు కల్పవృక్ష వాహన సేవ, సా.6-7 వరకు సర్వభూపాల వాహన సేవ, రా.8-9 వరకు చంద్రప్రభ వాహన సేవతో వేడుకలు ముగుస్తాయి.