News October 29, 2024
అప్పుడు ఆంక్షలు.. ఇప్పుడు పిల్లల్ని కనాలని ఆఫర్లు

ఒకప్పుడు పిల్లల్ని కనకుండా ఆంక్షలు విధించిన చైనా ఇప్పుడు బర్త్రేట్ పెంచేందుకు ఆఫర్లు ప్రకటిస్తోంది. ‘చైల్డ్ బర్త్ ఫ్రెండ్లీ సొసైటీ’ సృష్టికి చర్యలు తీసుకుంటోందని Xinhua న్యూస్ ఏజెన్సీ తెలిపింది. చైల్డ్ బర్త్, చైల్డ్ కేర్ సర్వీసెస్ బలోపేతం, ఎడ్యుకేషన్, హౌసింగ్, ఎంప్లాయిమెంట్ రంగాల్లో ప్రజలకు అనుకూలంగా స్కీములు తేనుందని పేర్కొంది. ఎక్కువ మంది ఉండేలా ఇళ్ల కొనుగోళ్లలో ఆఫర్లూ ఇవ్వనుందని తెలిపింది.
Similar News
News October 14, 2025
ఉమెన్స్ వరల్డ్ కప్: భారత్ సెమీస్ వెళ్లాలంటే?

SA, AUS చేతిలో ఓడిపోయిన టీమ్ఇండియా సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. నెక్ట్స్ ఈనెల 19న ENG, 23న NZ, 26న బంగ్లాతో తలపడనుంది. బంగ్లా మినహా ENG, NZపై భారత రికార్డు పేలవంగా ఉంది. కానీ వీటితో చివరగా జరిగిన సిరీస్ల్లో INDనే పైచేయి(2-1) సాధించింది. లీగ్లో మిగిలిన 3 మ్యాచ్ల్లో గెలిస్తే నేరుగా సెమీస్కు వెళ్లే అవకాశముంది. లేదంటే కనీసం 2 గెలిచి, మెరుగైన NRR మెయింటెన్ చేస్తే క్వాలిఫై అవ్వొచ్చు.
News October 14, 2025
జగన్ ఆస్తుల వివాదం.. స్టేటస్ కో విధించిన NCLT

YS జగన్కు చెందిన సరస్వతి సిమెంట్స్ షేర్ల బదిలీపై చెన్నైలోని NCLT అప్పిలేట్ ట్రిబ్యునల్ స్టేటస్ కో విధించింది. జులై 29న హైదరాబాద్ NCLT బెంచ్ జగన్కు అనుకూలంగా తీర్పునిచ్చింది. జగన్ తల్లి, చెల్లెలి పేరిట రాసిన గిఫ్ట్ డీడ్లో షేర్లు పూర్తిగా బదిలీ కాలేదని, అందువల్ల అవి జగన్ వద్దే ఉన్నట్లు తెలిపింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ వైఎస్ విజయమ్మ చెన్నై బెంచ్లో అప్పీల్ చేయగా దానిపై స్టేటస్ కో విధించింది.
News October 14, 2025
సరైన నిద్ర లేకపోతే కంటి సమస్యలు!

కంటినిండా నిద్రలేకపోతే కళ్లపై ఎఫెక్ట్ పడుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గాఢనిద్రలో కళ్లు సహజంగా కన్నీళ్లను ఉత్పత్తి చేస్తాయని, దీనివల్ల అవి మృదువుగా ఉంటాయని అంటున్నారు. నిద్ర సరిగా లేకపోతే కళ్లు పొడిబారిపోతాయని చెబుతున్నారు. దీర్ఘకాలికంగా ఇదే కంటిన్యూ అయితే రెటీనా పనితీరు మందగించి చూపు తగ్గుతుందని వార్నింగ్ ఇస్తున్నారు. రోజుకు 6-8 గంటలు నిద్రపోవాలని సూచిస్తున్నారు.
Share it