News September 24, 2024

అప్పుడు త్యాగాలు.. ఇప్పుడు పదవులు: టీడీపీ శ్రేణులు

image

AP: పార్టీ కోసం కష్టపడ్డ వారికి నామినేటెడ్ <<14181792>>పదవులు<<>> దక్కినట్లు టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. వారికి సీఎం చంద్రబాబు న్యాయం చేశారని అంటున్నాయి. పొత్తులో భాగంగా తమ స్థానాలను వదులుకోవడం, పార్టీకి ఆర్థికంగా అండగా ఉండడం, పార్టీ వాయిస్‌ను బలంగా వాదించిన వారికి పదవులు దక్కాయని సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. నారాయణ, పీతల సుజాత, దామచర్ల సత్య, దీపక్ రెడ్డి, రామరాజు వంటి వారు ఉన్నారు.

Similar News

News November 20, 2025

రేపు ఈ జిల్లాల్లో వర్షాలు: APSDMA

image

AP: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రేపు వర్షాలు పడతాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. కాగా ఈ నెల 22న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, NOV 24 నాటికి వాయుగుండంగా, ఆ తర్వాత తుఫానుగా మారుతుందని ఇప్పటికే ఓ ప్రకటనలో పేర్కొన్న సంగతి తెలిసిందే.

News November 20, 2025

హిందీ Vs మరాఠీ వివాదం.. యువకుడు ఆత్మహత్య

image

హిందీ-మరాఠీ <<15354535>>వివాదం<<>> ఓ యువకుడి ప్రాణాలు బలిగొంది. MHలోని థానేకు చెందిన అర్ణవ్ ములంద్‌లోని కాలేజీకి వెళ్లేందుకు లోకల్ ట్రైన్ ఎక్కాడు. ఈక్రమంలోనే రైలులో హిందీ-మరాఠీపై చర్చ జరిగింది. ఇది కాస్తా గొడవకు దారి తీయడంతో ఐదుగురు యువకుల గ్యాంగ్ అర్ణవ్‌పై దాడి చేసింది. దీంతో అతడు మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని అర్ణవ్ తండ్రి జితేంద్ర పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు కొనసాగుతోంది.

News November 20, 2025

రెండో టెస్టుకు భారత జట్టులో మార్పులివేనా?

image

గువాహటిలో ఎల్లుండి నుంచి సౌతాఫ్రికాతో జరిగే రెండో టెస్టుకు భారత జట్టులో రెండు మార్పులు జరిగే అవకాశముందని క్రీడా వర్గాలు తెలిపాయి. గిల్ స్థానంలో సాయి సుదర్శన్, పిచ్ కండిషన్‌ను బట్టి అక్షర్ పటేల్ ప్లేస్‌లో నితీశ్ కుమార్ రెడ్డిని ఆడించే ఛాన్స్ ఉందని పేర్కొన్నాయి. ఒకవేళ సాయి సుదర్శన్‌ను తీసుకోకపోతే దేవదత్ పడిక్కల్‌కు అవకాశం ఇస్తారని సమాచారం. ఎవరిని తీసుకుంటే బాగుంటుందో కామెంట్ చేయండి.