News June 4, 2024
అప్పట్లో షైనింగ్ ఇప్పుడు 400 పార్ – అచ్చిరాలే!

బీజేపీకి కొన్ని నినాదాలు కలిసిరావడం లేదు. 2004లో వాజ్పేయీ ‘ఇండియా షైనింగ్’తో బరిలోకి దిగారు. సరిగ్గా 20 ఏళ్లకు నరేంద్రమోదీ ‘అబ్కీ బార్ 400 పార్’తో రంగంలోకి దూకారు. అప్పట్లో కాంగ్రెస్ సౌజన్యంతో యూపీఏ వన్ విజయదుందుభి మోగించింది. 2024లో మాత్రం ఇండియా కూటమి గట్టి పోటీనిచ్చింది. అనూహ్యంగా పుంజుకొని బీజేపీని సొంతంగా మ్యాజిక్ ఫిగర్ దాటనివ్వలేదు. ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం NDA హ్యాట్రిక్కు ఢోకా లేదు.
Similar News
News September 3, 2025
టాబ్లెట్లను విరిచి వేసుకుంటున్నారా?

స్కోర్ లైన్ లేని టాబ్లెట్లను విరిచి వేసుకోవద్దని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ‘వైద్యుల సూచన లేకుండా ఏ టాబ్లెట్ను విరిచి వేసుకోవద్దు. టాబ్లెట్ను విరిస్తే దాని పనితీరు దెబ్బతినడంతో పాటు హానికరంగా మారే అవకాశముంది. డ్రగ్ రక్తంలో ఒకేసారి రిలీజై డోస్ ఎక్కువ అవ్వొచ్చు లేదా ఇన్ఎఫెక్టీవ్గా మారొచ్చు. కడుపులో ఇరిటేషన్ వచ్చే ఛాన్సుంటుంది. ఒకవేళ వైద్యులు సూచిస్తే పిల్ కట్టర్ వాడాలి’ అని సూచిస్తున్నారు.
News September 3, 2025
పంచాయతీ కార్యదర్శుల పదోన్నతులకు ప్రభుత్వం ఆమోదం: TPSA

TG: గ్రామ పంచాయతీలను గ్రేడింగ్ చేసి క్యాడర్ స్ట్రెంత్ నిర్ణయించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల అసోసియేషన్ అధ్యక్షుడు (TPSA) పి.మధుసూదన్ వెల్లడించారు. పంచాయతీ సెక్రటరీల పదోన్నతులకు అంగీకరించడంపై హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.
News September 3, 2025
బంగారం ధరలు ALL TIME RECORD

బంగారం ధరలు ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయికి చేరాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.880 పెరిగి రూ.1,06,970కు చేరింది. కాగా 9 రోజుల్లో రూ.5,460 పెరగడం గమనార్హం. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ.800 ఎగబాకి రూ.98,050 పలుకుతోంది. అటు KG వెండిపై రూ.900 పెరిగి రూ.1,37,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.