News January 13, 2025
అప్పుడు జైలుకెళ్లిన వారికి రూ.20 వేల పెన్షన్

1975 నుంచి 1977 మధ్య దేశంలో ఎమర్జెన్సీ అమలులో ఉన్న సమయంలో జైలుకెళ్లిన వారికి నెలవారీ రూ.20,000 పెన్షన్ మంజూరు చేస్తామని ఒడిశా ప్రభుత్వం ప్రకటించింది. పెన్షన్తో పాటు వారి వైద్య ఖర్చులనూ రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని, జనవరి 1, 2025 నాటికి జీవించి ఉన్న వారందరికీ ఈ సౌకర్యాలు కల్పిస్తామని తెలిపింది. జైలులో ఎన్ని రోజులు ఉన్నా సరే వారందరూ అర్హులే అని హోం శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది.
Similar News
News October 16, 2025
టీచర్లకు టెట్.. ప్రభుత్వం సమాలోచనలు!

AP: టెట్ రాసేందుకు టీచర్లకు అవకాశం కల్పించాలా? వద్దా? అనేదానిపై విద్యాశాఖ సమాలోచనలు చేస్తోంది. సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులు ఉద్యోగంలో కొనసాగాలన్నా, పదోన్నతి పొందాలన్నా రెండేళ్లలో టెట్ పాస్ కావాలని SEP 1న సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. అయితే దీన్ని ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. దీంతో తీర్పుపై రివ్యూ పిటిషన్ వేసే అంశంపైనా ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది. కాగా 2011కు ముందు టెట్ లేదు.
News October 16, 2025
సృష్టిలో శివ-శక్తి స్వరూపం

శివలింగాలు ప్రధానంగా 2 రకాలు. అవి స్థావరలింగం, జంగమ లింగం. చెట్లు, లతలు స్థావర లింగాలు కాగా, క్రిమి కీటకాదులు జంగమ లింగాలు. స్థావర లింగాన్ని నీరు పోసి సంతోషపెట్టాలి. జంగమ లింగాన్ని ఆహార వస్తువులతో తృప్తిపరచాలి. ఇదే నిజమైన శివ పూజ. సర్వత్రా ఉన్న పీఠం దేవి స్వరూపం. లింగం సాక్షాత్తూ చిన్మయ స్వరూపం. ఇలా సృష్టిలోని ప్రతి అంశంలోనూ శివ-శక్తి స్వరూపాన్ని గుర్తించి, సేవించడమే ఉత్తమ పూజా విధానం. <<-se>>#SIVOHAM<<>>
News October 16, 2025
రాష్ట్రంలో 218 పోస్టులు… అప్లై చేశారా?

ఏపీలోని మంగళగిరి ఎయిమ్స్ 218 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. వీటిలో సీనియర్ రెసిడెంట్స్ పోస్టులు 97 ఉండగా, ఫ్యాకల్టీ పోస్టులు 121 ఉన్నాయి. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. సీనియర్ రెసిడెంట్ పోస్టులకు ఈ నెల 21, ఫ్యాకల్టీ పోస్టులకు ఈ నెల 26 దరఖాస్తుకు ఆఖరు తేదీ. వెబ్సైట్: https://www.aiimsmangalagiri.edu.in/