News August 7, 2024
ఈ స్కూల్లో 11 మంది విద్యార్థులు.. ఏడుగురు టీచర్లు

TG: కరీంనగర్(D) గద్దపాక హైస్కూల్లో 11 మంది విద్యార్థులే చదువుతున్నారు. వీరికి ఏడుగురు టీచర్లు బోధిస్తున్నారు. 6thలో ఇద్దరు, 7thలో ఒక్కరు, 8th, 10thలో నలుగురి చొప్పున విద్యార్థులున్నారు. స్టూడెంట్స్ సంఖ్యను పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు టీచర్లు తెలిపారు. ప్రభుత్వ స్కూళ్లను ప్రోత్సహించాలని కోరుతున్నారు.
Similar News
News January 23, 2026
బీపీ తగ్గాలంటే ఇవి తినాలి

ప్రపంచ వ్యాప్తంగా అనేక మందిని బీపీ ప్రభావితం చేస్తుంది. అయితే కొన్ని ఆహారాలను డైట్లో చేర్చుకోవడం వల్ల హైబీపీని తగ్గించొచ్చంటున్నారు నిపుణులు. ఆకుకూరలు, అరటి పళ్లు, ఓట్స్, బ్లూ బెర్రీ, స్ట్రాబెర్రీ, సాల్మన్, మాకేరెల్ చేపలను తీసుకోవాలి. అలాగే సాసేజ్, ప్రాసెస్ చేసిన మాంసం, సోడాలు, శీతల పానీయాలు, ఎనర్జీ డ్రింక్స్, నిల్వ పచ్చళ్లు, ఫాస్ట్ ఫుడ్, పిజ్జా, బర్గర్కు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.
News January 23, 2026
రేపటి నుంచి 4 రోజులు బ్యాంకులు బంద్!

రేపటి నుంచి నాలుగు రోజుల పాటు బ్యాంకులకు సెలవులు ఉండనున్నాయి. రేపు 4వ శనివారం కాగా ఎల్లుండి ఆదివారం. 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా బ్యాంకులు తెరుచుకోవు. ఇక వారానికి 5 రోజుల పనిదినాలు డిమాండ్ చేస్తూ బ్యాంకు యూనియన్లు మంగళవారం(27న) సమ్మెకు దిగనున్నాయి. దీంతో ఆరోజు కూడా తెరుచుకునే పరిస్థితి లేదు. ఫలితంగా వరుసగా 4 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. అయితే డిజిటల్ సేవల్లో ఎలాంటి అంతరాయం ఉండదు.
News January 23, 2026
₹11,399 కోట్లతో 6000 KM రోడ్ల అభివృద్ధి: కోమటిరెడ్డి

TG: IT, AI లైఫ్ సైన్సెస్ వంటి రంగాల్లో ఇన్వెస్ట్మెంట్స్ లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తోందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. గ్లోబల్ సమ్మిట్లో ₹5.75 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని HYDలో జరిగిన ‘ఏస్ టెక్ హైదరాబాద్-2026’ సదస్సులో తెలిపారు. ₹11399 కోట్లతో 6000 KM రోడ్లను అభివృద్ధి చేస్తామని చెప్పారు. బెటర్ లైఫ్, మోర్ జాబ్స్, స్ట్రాంగ్ ఎకానమీకి ట్రాన్స్పోర్ట్ చాలా కీలకమన్నారు.


