News October 27, 2024

విశాఖ-విజయవాడ మధ్య 2 విమాన సర్వీసులు

image

AP: విశాఖ-విజయవాడ మధ్య కొత్తగా 2 విమాన సర్వీసులను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు నేడు ప్రారంభించనున్నారు. ఎయిర్‌ఇండియా ఎక్స్‌ప్రెస్ ఉ.9.35కు విశాఖలో బయలుదేరి ఉ.10.35కు గన్నవరం చేరుకుంటుంది. తిరిగి రాత్రి 7.55కు విజయవాడ నుంచి బయలుదేరి రా.9 గంటలకు విశాఖకు చేరుతుంది. ఇండిగో సర్వీసు రా.7.15కు విజయవాడ నుంచి విశాఖకు వెళ్లి, తిరిగి రా.8.45కు అక్కడి నుంచి బయలుదేరి గన్నవరం చేరుకుంటుంది.

Similar News

News January 21, 2026

వేప పిండి, పిడకల ఎరువుతో ప్రయోజనాలు

image

ఒక టన్ను వేప పిండిని దుక్కిలో(లేదా) పంట పెట్టిన తర్వాత వేస్తే 52 నుంచి 55KGల నత్రజని, 10KGల భాస్వరం, 14-15KGల పొటాష్ ఇతర పోషకాలు పంటకు అందుతాయి. బాగా పొడిచేసిన పిడకల ఎరువు(36-40 బస్తాలు)ను సాగు భూమిలో వేస్తే 5-15KGల నత్రజని, 3-9KGల భాస్వరం, 5-19KGల పొటాష్ ఇతర పోషకాలు పంటకు అందుతాయి. వేపపిండిలోని పోషకాల శాతం భూమికి అదనపు బలాన్నిచ్చి, చీడపీడలు, తెగుళ్ల ముప్పును తగ్గిస్తుంది.

News January 21, 2026

సమయం అనుకూలించనప్పుడు చేయాల్సిన పనులు

image

కాలం కలిసి రానప్పుడు పాటించే కొన్ని ఆధ్యాత్మిక నియమాలు మనలో మార్పులు తెస్తాయి. బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేస్తే ఉన్నత స్థాయికి చేరుకుంటారు. బయటకు వెళ్లేటప్పుడు నుదుట కుంకుమ, విభూతి ధరిస్తే దృష్టి దోషాలు తొలగి శుభం కలుగుతుంది. శుక్రవారం లక్ష్మీ గణపతిని ఎర్రని పూలతో పూజిస్తే అభివృద్ధి లభిస్తుంది. నిద్రించే ముందు గురు చరిత్ర పారాయణం చేయడం, ఉదయాన్నే అరచేతిని దర్శించడం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి.

News January 21, 2026

తెలంగాణకు భారీ పెట్టుబడులు

image

TG: రాష్ట్రంలో స్టీల్ ఉత్పత్తి యూనిట్ ఏర్పాటుకు DI పైపుల తయారీ సంస్థ రష్మి గ్రూప్‌ ముందుకు వచ్చింది. దావోస్‌లో CM రేవంత్ బృందంతో ₹12,500Cr పెట్టుబడికి MOU చేసుకుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా 12K ఉద్యోగాలు వచ్చే అవకాశముంది. అటు ₹6వేల కోట్ల పెట్టుబడితో స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ ఆధారిత విద్యుత్ ప్రాజెక్ట్ అభివృద్ధికి ‘న్యూక్లర్ ప్రొడక్ట్స్’ సంస్థ ప్రభుత్వానికి ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ సమర్పించింది.