News November 1, 2024

మహారాష్ట్రలో 100ఏళ్ల ఓటర్లు 47,000 మంది

image

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 20న జరగనున్నాయి. కాగా అక్కడి ఓటర్ల జాబితాను పరిశీలించగా రాష్ట్రంలో మొత్తం 9.7 కోట్ల ఓటర్లు ఉంటే 100ఏళ్ల వయసు పైబడిన వారు ఏకంగా 47,392 ఉన్నట్లు తేలింది. ఈసారి ఎన్నికల్లో ఓటు వేయనున్న అత్యంత వృద్ధ ఓటర్ వయసు 109ఏళ్లు. 18-19ఏళ్ల వయసున్న ఓటర్ల సంఖ్య 22,22,704గా ఉంది.

Similar News

News January 30, 2026

రోజూ గోరువెచ్చటి నీరు తాగితే..

image

గోరువెచ్చని నీటిని తాగడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయంటున్నారు నిపుణులు. గోరువెచ్చని నీరు తాగడం వల్ల శరీరంలోని వ్యర్థాలు, విషపదార్థాలు బయటికి వెళ్లిపోతాయి. దీంతో మొటిమలు రాకుండా ఉంటాయి. జీర్ణక్రియ బావుండటంతో పాటు రక్త సరఫరా బాగా జరుగుతుంది. చర్మం తాజాగా ఉండటంతో పాటు ఫ్రీ ర్యాడికల్స్‌తో దెబ్బతిన్న చర్మ కణాలు పునరుత్తేజం అవుతాయి. అంతేకాకుండా చర్మంపై ముడతలు, మచ్చలు తగ్గిపోయి వృద్ధ్యాప్య ఛాయలు కనిపించవు.

News January 30, 2026

ముగిసిన నామినేషన్ల పర్వం

image

TG: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఇప్పటికే కార్యాలయాల్లో ఉన్న వారికి నామినేషన్లు వేసేందుకు అధికారులు అనుమతి ఇచ్చారు. రేపు వాటిని పరిశీలించనున్నారు. వచ్చే నెల 3 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఇచ్చారు. అదే రోజున సాయంత్రం పోటీలో నిలిచే అభ్యర్థుల తుది జాబితా విడుదల చేయనున్నారు. ఫిబ్రవరి 11న 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు పోలింగ్ జరగనుంది. 13న ఫలితాలు వెల్లడికానున్నాయి.

News January 30, 2026

ఆదివారమూ స్టాక్ మార్కెట్.. చరిత్రలో రెండోసారి

image

సాధారణంగా స్టాక్ మార్కెట్లకు సండే సెలవు. కానీ వచ్చే ఆదివారం(FEB 1) NSE, BSE ఓపెన్‌లో ఉండనున్నాయి. ఆ రోజున కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టనుండటమే దీనికి కారణం. ప్రభుత్వ పాలసీలు, ప్రకటనలపై ఇన్వెస్టర్లు స్పందించేందుకు వీలుగా ట్రేడింగ్ కొనసాగుతుంది. ఈక్విటీ మార్కెట్స్ ఆదివారమూ ఓపెన్‌లో ఉండటం చరిత్రలో ఇది రెండోసారి. తొలిసారి FEB 28(సండే), 1999న యశ్వంత్ బడ్జెట్ ప్రజెంట్ చేసినప్పుడూ మార్కెట్లు పనిచేశాయి.