News June 6, 2024
EVMలపై అనుమానాలున్నాయి.. జగన్తో వైసీపీ నేతలు

AP: ఈవీఎంలపై అనుమానాలున్నాయని, పరిశీలన చేయాలని వైసీపీ నేతలు పార్టీ అధినేత జగన్కు సూచించారు. ఎన్నికల తీరుపై పలువురు సందేహాలు వ్యక్తం చేశారు. కొందరు అధికారులు ఈసీతో కుమ్మక్కవ్వడంతోనే సీట్లు తగ్గాయని నేతలు ఆరోపించారు. మరోవైపు పార్టీ శ్రేణులకు అండగా నిలబడాలని జగన్ నేతలను ఆదేశించారు. ఈ నెల 10 నుంచి తాడేపల్లి క్యాంపు కార్యాలయాన్ని YCP సెంట్రల్ ఆఫీసుగా మార్చాలని నిర్ణయించారు.
Similar News
News September 11, 2025
నేపాల్ ప్రజలకు అధ్యక్షుడు బహిరంగ ప్రకటన

ఉద్రిక్త పరిస్థితుల నడుమ నేపాల్ అధ్యక్షుడు రామ్ చంద్ర పౌడెల్ బహిరంగ ప్రకటన చేశారు. రాజ్యాంగాన్ని అనుసరిస్తూ ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నానని లేఖ విడుదల చేశారు. క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడేందుకు మార్గాలను అన్వేషిస్తున్నానని పేర్కొన్నారు. డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు సంయమనం పాటించాలని దేశ ప్రజలను కోరారు. త్వరలోనే సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
News September 11, 2025
భారత విపక్షం వెనుక విదేశీ హస్తం: భండారీ

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ‘ఓట్ చోరీ’ ప్రజెంటేషన్పై BJP అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ సంచలన ఆరోపణలు చేశారు. ‘రాహుల్ను ఏ ఫారిన్ బాస్ నడిపిస్తున్నారు? AUG 7న ఓట్ చోరీపై వెబ్సైట్లో 3PDFs అప్లోడ్ చేశారు. అవి మయన్మార్ నుంచి అప్లోడ్ అయ్యాయి. ఆధారాలంటూ ఆయన చూపినవి ఇండియాలో తయారవ్వలేదు. భారత విపక్షం వెనుక విదేశీ హస్తముందని బయటపడింది. రాహుల్, కాంగ్రెస్ డెమోక్రసీకి అత్యంత ప్రమాదకరం’ అని ట్వీట్ చేశారు.
News September 11, 2025
గృహ హింస కేసు.. హీరోయిన్కు నిరాశ

గృహ హింస కేసులో హీరోయిన్ <<15080954>>హన్సిక<<>>కు బాంబే హైకోర్టులో నిరాశ ఎదురైంది. ఆమె దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. 2021లో ముస్కాన్కు హన్సిక సోదరుడు ప్రశాంత్తో పెళ్లవ్వగా పలు కారణాలతో విడిపోవాలనుకున్నారు. అదే సమయంలో ప్రశాంత్తో పాటు ఆయన తల్లి జ్యోతి, హన్సిక తనను మానసికంగా వేధిస్తున్నారని ముస్కాన్ ఫిర్యాదు చేశారు. అయితే ఈ కేసులో హన్సిక, జ్యోతికి కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.