News April 29, 2024

లోక్‌సభ బరిలో తొమ్మిది మంది నారీమణులు

image

APలోని 25 లోక్‌సభ స్థానాల్లో 9మంది మహిళలకు ప్రధాన పార్టీలు అవకాశం కల్పించాయి. వీరిలో వైసీపీ నుంచి తనూజా రాణి- అరకు, విశాఖ-బొత్స ఝాన్సీ, నరసాపురం- ఉమా బాల, హిందూపురం- శాంత; కూటమి అభ్యర్థులుగా.. నంద్యాల- బైరెడ్డి శబరి(TDP), రాజమహేంద్రవరం- పురందీశ్వరి(BJP), అరకు- కొత్తపల్లి గీత(BJP) ఉన్నారు. కాంగ్రెస్ నుంచి కడప-YS షర్మిల, ఏలూరు-లావణ్య పోటీ చేస్తున్నారు. వీరిలో పార్లమెంట్ తలుపుతట్టేదెవరో చూడాలి.
<<-se>>#ELECTIONS2024<<>>

Similar News

News January 26, 2026

కర్రెగుట్టల్లో పేలిన ఐఈడీలు.. 11 మంది జవాన్లకు గాయాలు

image

ఛత్తీస్‌గఢ్-TG సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో బాంబుల మోత మోగింది. మావోయిస్టులు అమర్చిన ఐఈడీలు భద్రతా బలగాలు కూంబింగ్‌‌ నిర్వహిస్తుండగా వరుసగా పేలాయి. దీంతో 11 మంది జవాన్లు గాయపడ్డారు. వీరిలో 10 మంది DRG, ఒకరు కోబ్రా బెటాలియన్‌కు చెందిన సబ్ ఇన్‌స్పెక్టర్ ఉన్నారు. వారిని ఆర్మీ హెలికాప్టర్‌లో రాయ్‌పూర్‌ ఆసుపత్రికి తరలించారు. గతేడాది కర్రెగుట్టల్లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 31మంది నక్సల్స్ మరణించారు.

News January 26, 2026

దూడలలో తెల్లపారుడు వ్యాధి ఎలా వ్యాపిస్తుంది?

image

తెల్లపారుడు వ్యాధిని కలిగించే ఇ.కోలి క్రిమి సహజంగా దూడ పేగులలో ఉంటుంది. దూడలు అపరిశుభ్రమైన పొదుగు లేదా పాత్రలలో పాలు తాగినప్పుడు, ఒక్కసారిగా ఎక్కువగా పాలు తాగినప్పుడు, వెన్న ఎక్కువగా ఉన్న చివరి పాలు తాగినప్పుడు, పాలు తాగే సమయాలలో తేడా ఉన్నప్పుడు, జున్నుపాలు సరిగా తాగనప్పుడు, దూడల్లో వ్యాధి నిరోధక శక్తి తగ్గినప్పుడు.. దూడ పేగుల్లోని హానికర ఇ.కోలి సంఖ్య పెరిగి తెల్లపారుడు వ్యాధి కలుగుతుంది.

News January 26, 2026

NTPCలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

image

<>NTPC<<>>లో 25 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. CA/CMA అర్హతగల వారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 29 ఏళ్లు. సబ్జెక్ట్ నాలెడ్జ్ టెస్ట్, ఎగ్జిక్యూటివ్ అప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. బేసిక్ పే రూ.40వేలు. దరఖాస్తు ఫీజు రూ.500, SC/ST/PwBDలకు ఫీజు లేదు. వెబ్‌సైట్: https://careers.ntpc.co.in