News April 15, 2025
మయన్మార్లో ఇంకా 1.25 లక్షల ట్రక్కుల శిథిలాలు!

మయన్మార్లో భూకంపం సృష్టించిన విధ్వంసం అంతాఇంతా కాదు. దాని వల్ల కూలిన భవనాల శిథిలాలు ఇంకా 1,25,000 ట్రక్కుల మేర మిగిలే ఉన్నాయని ఐక్యరాజ్యసమితి తాజాగా ప్రకటించింది. 10వేల ఇళ్లు ధ్వంసమయ్యాయని పేర్కొంది. మయన్మార్లోని మండాలయ్, సగైంగ్ లై నగరాల్లో రెండు వారాల క్రితం 7.7 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా 3600మందికి పైగా మృతిచెందగా 60వేలమందికి పైగా నిరాశ్రయులైన సంగతి తెలిసిందే.
Similar News
News April 16, 2025
TGలో రానున్న రెండ్రోజులు వాతావరణం ఎలా ఉంటుందంటే?

TG: ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో 2రోజుల పాటు పగటిపూట ఎండ, సాయంత్రం వర్షాలు పడే అవకాశాలున్నాయని IMD తెలిపింది. కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్ జిలాల్లో వర్షాలు పడతాయంది. 40KM వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది.
News April 16, 2025
నేడు విదేశీ పర్యటనకు సీఎం చంద్రబాబు

AP: CM చంద్రబాబు ఇవాళ యూరప్ పర్యటనకు వెళ్తున్నారు. కుటుంబసభ్యులతో కలిసి ఈ నెల 20న చంద్రబాబు తన పుట్టినరోజు వేడుకలను అక్కడే జరుపుకోనున్నారు. చంద్రబాబు ఇవాళ సాయంత్రం విజయవాడ నుంచి ఢిల్లీ వెళ్తారు. అక్కడి నుంచి ఆయన విదేశాలకు చేరుకుంటారు. తిరిగి ఈ నెల 22న ఢిల్లీకి చేరుకుని పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది. CM వ్యక్తిగత పర్యటన కావడంతో ఏ దేశానికి వెళ్తున్నారనేదానిపై వివరాలు గోప్యంగా ఉంచారు.
News April 16, 2025
నేడు సుప్రీంలో కంచ గచ్చిబౌలి భూ వివాదంపై విచారణ

కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై నేడు సుప్రీంలో విచారణ జరగనుంది. దేశ వ్యాప్తంగా ఈ భూముల అంశం చర్చనీయాంశంగా మారడంతో సుప్రీం ఈ కేసును సుమోటో స్వీకరించి భూమి చదును చేసే పనులపై స్టే విధించిన విషయం తెలిసిందే. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు.. సీఎస్ శాంతికుమారి ఈ కేసుపై అఫిడవిట్ దాఖలు చేశారు. ఆ భూములు ప్రభుత్వానివే అని, 20 ఏళ్లుగా న్యాయవివాదంలో ఉండటం వల్ల ఆ స్థలంలో చెట్లు పెరిగాయని పేర్కొన్నారు.