News December 8, 2024
కోహ్లీ బ్యాటింగ్ టెక్నిక్లో సమస్య ఉంది: మంజ్రేకర్

విరాట్ కోహ్లీ అడిలైడ్ టెస్టులో 2 ఇన్నింగ్స్లలోనూ తక్కువ స్కోరుకే ఔటయ్యారు. ఆయన ఆడుతున్న విధానంలో లోపం ఉందని కామెంటేటర్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డారు. ఆఫ్స్టంప్ ఆవల స్వింగ్ అయ్యే బాల్ను ఆడేందుకు కోహ్లీ కొత్త టెక్నిక్ ఎంచుకున్నారని, అది సత్ఫలితాలను ఇవ్వడంలేదని పేర్కొన్నారు. మరోవైపు క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ విరాట్కు మద్దతుగా నిలిచారు. ఇదే టెక్నిక్తో కోహ్లీ 9వేల పరుగులు చేశారని గుర్తుచేశారు.
Similar News
News November 13, 2025
కూరగాయల సాగు.. ఎకరాకు రూ.9,600 సబ్సిడీ

TG: రాష్ట్రంలో ఏటా 10వేల ఎకరాల మేర కూరగాయల సాగు విస్తీర్ణం పెంచేందుకు ఉద్యానశాఖ చర్యలు చేపట్టింది. రైతులకు ఈ సీజన్ నుంచే ఎకరాకు రూ.9,600 సబ్సిడీని వారి ఖాతాల్లో జమ చేస్తోంది. అటు పలు రకాల కూరగాయల నారు కూడా సిద్ధం చేసింది. నారు అవసరం ఉన్నవారి నుంచి అప్లికేషన్లు తీసుకుంటోంది. నారు, సబ్సిడీ కావాల్సిన రైతులు సంబంధిత మండలాల్లో హార్టికల్చర్ ఆఫీసర్లకు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.
News November 13, 2025
శీతాకాలంలో స్కిన్ బావుండాలంటే..

చలికాలంలో చర్మం ఈజీగా పొడిబారి, పగుళ్లు వస్తాయి. ఇలాకాకుండా ఉండాలంటే కొన్ని టిప్స్ పాటించాలంటున్నారు నిపుణులు. ఈ కాలంలో మాయిశ్చరైజర్ ఎక్కువగా వాడాలి. గోరువెచ్చటి నీళ్లతోనే స్నానం చేయాలి. చర్మానికి తేమనిచ్చే సబ్బులనే వాడాలి. చేతులకు గ్లౌజులు, కాళ్లకు సాక్సులు ధరించాలి. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు, పండ్లు, ఆకుపచ్చని కూరగాయలు, తగినంత నీరు తీసుకుంటే చర్మం తేమగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
News November 13, 2025
ఫ్రీ బస్ పథకం.. ఆర్టీసీకి రూ.7980Cr చెల్లింపు: మంత్రి పొన్నం

TG: RTCలో ఇప్పటి వరకు మహిళలు 237కోట్ల జీరో టికెట్ ఉపయోగించుకున్నారని, ప్రభుత్వం RTCకి ₹7980Cr చెల్లించిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. RTC ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ పెంచుకోవడానికి అవకాశాలను అన్వేషించాలని ఆదేశించారు. బస్సు ప్రమాదాలు నివారించేందుకు డ్రైవర్ మానిటరింగ్ సిస్టమ్ను అమలు చేస్తామన్నారు. కారుణ్య నియామకాల ప్రొవిజనల్ పీరియడ్ను 3 నుంచి 2ఏళ్లకు తగ్గించాలన్నారు.


