News December 8, 2024
కోహ్లీ బ్యాటింగ్ టెక్నిక్లో సమస్య ఉంది: మంజ్రేకర్

విరాట్ కోహ్లీ అడిలైడ్ టెస్టులో 2 ఇన్నింగ్స్లలోనూ తక్కువ స్కోరుకే ఔటయ్యారు. ఆయన ఆడుతున్న విధానంలో లోపం ఉందని కామెంటేటర్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డారు. ఆఫ్స్టంప్ ఆవల స్వింగ్ అయ్యే బాల్ను ఆడేందుకు కోహ్లీ కొత్త టెక్నిక్ ఎంచుకున్నారని, అది సత్ఫలితాలను ఇవ్వడంలేదని పేర్కొన్నారు. మరోవైపు క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ విరాట్కు మద్దతుగా నిలిచారు. ఇదే టెక్నిక్తో కోహ్లీ 9వేల పరుగులు చేశారని గుర్తుచేశారు.
Similar News
News November 18, 2025
మారేడుమిల్లిలో ఎన్కౌంటర్.. ఆరుగురు మావోలు మృతి

AP: అల్లూరి జిల్లా మారేడుమిల్లి అడవుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులు-మావోయిస్టులకు జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మరణించారు. మృతుల్లో ఛత్తీస్గఢ్ మావోయిస్టు అగ్రనేతలున్నట్లు సమాచారం. టైగర్ జోన్లో కూంబింగ్ కొనసాగుతోంది. ఏపీ-ఛత్తీస్గఢ్-ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో పోలీసులు ఈ ఆపరేషన్ మొదలుపెట్టారు.
News November 18, 2025
మారేడుమిల్లిలో ఎన్కౌంటర్.. ఆరుగురు మావోలు మృతి

AP: అల్లూరి జిల్లా మారేడుమిల్లి అడవుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులు-మావోయిస్టులకు జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మరణించారు. మృతుల్లో ఛత్తీస్గఢ్ మావోయిస్టు అగ్రనేతలున్నట్లు సమాచారం. టైగర్ జోన్లో కూంబింగ్ కొనసాగుతోంది. ఏపీ-ఛత్తీస్గఢ్-ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో పోలీసులు ఈ ఆపరేషన్ మొదలుపెట్టారు.
News November 18, 2025
సతీశ్ మృతి కేసు.. కీలకంగా ఫోన్ డేటా!

AP: టీటీడీ మాజీ ఏవీఎస్వో సతీశ్ మృతి కేసు దర్యాప్తులో ఆయన ఫోన్లోని సమాచారం కీలకంగా మారింది. ఫోన్ ధ్వంసమవడంతో ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. పరకామణి చోరీ కేసులో ఈ నెల 6న విచారణకు హాజరైన సతీశ్ 13న అనుమానాస్పద స్థితిలో మరణించారు. దీంతో ఆ రెండు తేదీల మధ్య ఆయన ఎవరెవరితో మాట్లాడారో తెలుసుకునేందుకు మెసేజ్లు, వాట్సాప్ కాల్స్, ఇంటర్నెట్ కాల్స్ డేటాను పోలీసులు పరిశీలిస్తున్నారు.


