News July 21, 2024
జగన్లో ఇంకా మార్పు రాలేదు: సీఎం చంద్రబాబు

AP: ప్రజలు తిరస్కరించినా వైసీపీ అధినేత జగన్ ప్రవర్తనలో ఏమాత్రం మార్పు రాలేదని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేది టీడీపీ కార్యకర్తలైనా సరే సహించేది లేదని పార్లమెంటరీ పార్టీ సమావేశంలో స్పష్టం చేశారు. తప్పుడు ప్రచారంతో జగన్ మళ్లీ ప్రజల్ని మోసం చేయాలని చూస్తున్నారని, వైసీపీ కుట్రల్ని అడ్డుకోవాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు.
Similar News
News November 5, 2025
షమీకి మరోసారి నిరాశ.. రీఎంట్రీ కష్టమేనా?

టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీకి మరోసారి నిరాశ ఎదురైంది. NOV 14 నుంచి సౌతాఫ్రికాతో జరిగే రెండు మ్యాచుల టెస్ట్ సిరీస్కు BCCI ప్రకటించిన <<18208501>>జట్టులో<<>> ఆయనకు చోటు దక్కలేదు. ఇటీవల ఆస్ట్రేలియా సిరీస్కూ ఆయన్ను సెలక్ట్ చేయని సంగతి తెలిసిందే. దీంతో షమీ కెరీర్ ముగిసినట్లేనా అని క్రికెట్ ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. కాగా ఇటీవల రంజీ ట్రోఫీలో ఆయన 3 మ్యాచుల్లో 15 వికెట్లు పడగొట్టారు.
News November 5, 2025
కొత్తగా 8 జిల్లాల ఏర్పాటుకు సూచనలు: అనగాని

AP: కొత్తగా 8 జిల్లాల ఏర్పాటుకు పలు వర్గాల నుంచి సూచనలు వచ్చాయని మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. అలాగే కొత్త రెవెన్యూ డివిజన్ల కోసమూ వినతులు అందినట్లు చెప్పారు. పాలనా సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకొనే వీటిపై నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు. CM సూచనతో అల్లూరి(D)లో ప్రత్యేక అభివృద్ధి మండలి ఏర్పాటుపై ఆలోచనలు చేస్తున్నామన్నారు. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో అక్రమాలపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
News November 5, 2025
జనవరిలో గగన్యాన్ ప్రాజెక్టు అన్క్రూడ్ మిషన్: ISRO ఛైర్మన్

ఇండియా ‘మానవ సహిత గగన్యాన్’లో భాగంగా అన్క్రూడ్ మిషన్ను జనవరిలో చేపట్టే అవకాశముందని ఇస్రో ఛైర్మన్ నారాయణన్ తెలిపారు. ఇప్పటికే 8వేల టెస్టులు నిర్వహించామన్నారు. 2027లో మానవ సహిత గగన్యాన్కు ముందు 3 అన్క్రూడ్ మిషన్లను చేపడతామని వివరించారు. భారత అంతరిక్ష కేంద్ర ఫస్ట్ మాడ్యూల్ను 2028లో లాంచ్ చేస్తామన్నారు. నాసాతో కలిసి రూపొందించిన NISAR శాటిలైట్ ఆపరేషన్పై శుక్రవారం ప్రకటన చేయనున్నట్లు చెప్పారు.


