News May 11, 2024
ఏ ఆగస్టులో రుణమాఫీ చేస్తారో క్లారిటీ లేదు: కేసీఆర్

TG: సీఎం రేవంత్ ఆగస్టు 15న రుణమాఫీ చేస్తానని చెబుతున్నాడు గానీ ఈ ఏడాదేనా అనేది క్లారిటీ లేదని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అన్నారు. రైతు సంఘాలు కూడా ఇదే విషయాన్ని తనతో ప్రస్తావించాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రావడమే శాపంగా ఉందని రైతులు భావించారని పేర్కొన్నారు. ఏ ఊరుకు వెళ్తే ఆ ఊరిలో సీఎం ఒట్లు పెట్టడం హాస్యాస్పదంగా మారిందన్నారు. నీటి విషయంలో నిర్వహణ లోపించిందని.. దీంతో పంటలు ఎండిపోయాయని చెప్పారు.
Similar News
News February 8, 2026
SERలో 54 పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

సౌత్ ఈస్ట్రన్ రైల్వే(<
News February 8, 2026
స్వల్పంగా తగ్గిన చికెన్ ధరలు

తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో చికెన్ ధరలు కాస్త తగ్గాయి. గుంటూరు, తిరుపతిలో స్కిన్లెస్ కేజీ రూ.220-230 వరకు పలుకుతోంది. అటు హైదరాబాద్లో మాత్రం కేజీ రూ.270-280 ఉంది. విజయవాడ, కామారెడ్డిలోనూ రూ.270 వరకు విక్రయిస్తున్నారు. రెండు రాష్ట్రాల్లో మటన్ కేజీ ధర రూ.900-1,000 వరకు ఉంది. మరి మీ ఏరియాలో చికెన్ రేటు ఎంత ఉందో కామెంట్ చేయండి.
News February 8, 2026
భారత్-అమెరికా డీల్: రష్యాతో దోస్తీకి ముప్పు పొంచి ఉందా?

అమెరికాతో ట్రేడ్ డీల్ కుదిరినా రష్యా నుంచి చమురు కొనుగోళ్లు తగ్గినా.. మాస్కోతో భారత మైత్రికి ఢోకా ఉండదని విశ్లేషకులు అంటున్నారు. మన రక్షణ వ్యవస్థలో ఇప్పటికీ చాలా ఆయుధాలు రష్యావే. S-400 మిస్సైల్స్, అణుశక్తి వంటి విషయాల్లో ఆ దేశమే మన నమ్మకమైన భాగస్వామి. మరోవైపు చైనాను కట్టడి చేయాలన్నా మనకు పుతిన్ సహకారం చాలా కీలకం. అటు అమెరికా టెక్నాలజీని, ఇటు రష్యా నమ్మకాన్ని భారత్ బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది.


