News April 28, 2024

జగన్ పాలనకు, వైఎస్ పాలనకు పోలికే లేదు: షర్మిల

image

AP: CM జగన్ పాలనకు, వైఎస్ఆర్ పాలనకు అసలు పోలికే లేదని PCC చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. ‘వైఎస్ ఎప్పుడూ ప్రజల మధ్యలోనే ఉండేవారు.. కానీ జగన్ మాత్రం ఎప్పుడూ ప్రజలతో మమేకం కాలేదు. జగన్ పాలనలో మంత్రులకే అపాయింట్‌మెంట్ దొరకదు. మద్య నిషేధం అని చెప్పి.. ప్రభుత్వమే మద్యం అమ్ముతోంది. ప్రపంచంలో ఎక్కడా లేని బ్రాండ్స్ ఇక్కడే ఉన్నాయి. నాసిరకం మద్యం తాగి ప్రజలు చనిపోతున్నా పట్టించుకోవడం లేదు’ అని ఆమె మండిపడ్డారు.

Similar News

News January 21, 2026

SONY ఠీవీ.. ఇక ఇంటికి రాదా?

image

TV బ్రాండ్ అనగానే విన్పించే SONY సంస్థ TCLతో ఒప్పందం చేసుకుంది. దీంతో ఇకపై సోనీ బ్రాండ్ టీవీలు మార్కెట్లోకి రావా? అనే సందేహం నెలకొంది. అయితే SONY, BRAVIA పేర్లతోనే TCL టెలివిజన్ సెట్స్ తయారు చేయనుంది. భాగస్వామ్యంలో కొత్తగా ఏర్పాటయ్యే కంపెనీలో జపాన్ దిగ్గజానికి 49% వాటా, చైనా ప్రభుత్వం భాగస్వామిగా గల TCLకు 51% షేర్ ఉంటాయి. అయితే ప్రొడక్షన్ మారడంతో క్వాలిటీ తదితరాలు ఎలా ఉంటాయో వేచిచూడాలి.

News January 21, 2026

OpenAI పని ఖతం: జార్జ్ నోబుల్

image

OpenAI కంపెనీ త్వరలో కుప్పకూలుతుందని ప్రముఖ ఇన్వెస్టర్ జార్జ్ నోబుల్ అంచనా వేశారు. ఓవైపు Google Gemini యూజర్లు పెరుగుతుంటే ChatGPT ట్రాఫిక్ వరుసగా 2 నెలలు పడిపోయిందన్నారు. ఆ కంపెనీ సింగిల్ క్వార్టర్‌లో $12B నష్టపోయిందని, టాలెంటెడ్ ఉద్యోగులూ వెళ్లిపోతున్నారని చెప్పారు. మరోవైపు మస్క్ వేసిన $134B <<14762221>>దావా<<>> ఏప్రిల్‌లో విచారణకు రానుందని గుర్తుచేశారు. వీటన్నింటితో ఆ సంస్థకు మనుగడ కష్టమేనని అభిప్రాయపడ్డారు.

News January 21, 2026

25న రథ సప్తమి.. ఆ దర్శనాలన్నీ రద్దు!

image

AP: తిరుమలలో ఈ నెల 25న రథ సప్తమిని వైభవంగా నిర్వహించనున్నట్లు TTD తెలిపింది. ఈ నేపథ్యంలో ఆరోజు ఆర్జిత సేవలు, NRI, చంటి బిడ్డల తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్లు, వికలాంగుల ప్రివిలేజ్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. అలాగే తిరుపతిలో 24 నుంచి 26వ తేదీ వరకు స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల జారీని నిలిపేసినట్లు పేర్కొంది. ప్రొటోకాల్ ప్రముఖులకు మినహా VIP బ్రేక్ దర్శనాలు రద్దు చేసినట్లు వివరించింది.