News February 18, 2025
ఢిల్లీ తొక్కిసలాటలో కుట్ర కోణం లేదు: రైల్వే మంత్రి

ఢిల్లీ తొక్కిసలాట ఘటనలో ఎలాంటి కుట్ర కోణం లేదని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తేల్చిచెప్పారు. ‘తొక్కిసలాట జరిగేంత రద్దీ కూడా రైల్వే స్టేషన్లో లేదు. కుట్రేమీ లేదని భావిస్తున్నాం. ప్రస్తుతం సీసీటీవీ పర్యవేక్షణ మరింతగా పెంచాం’ అని పేర్కొన్నారు. మరోవైపు ఢిల్లీ స్టేషన్కు ప్రయాణికుల రద్దీ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో 8 కంపెనీల పారామిలిటరీ బలగాల్ని స్టేషన్కు లోపల, బయటా మోహరించినట్లు అధికారులు తెలిపారు.
Similar News
News October 26, 2025
18 మృతదేహాలు అప్పగింత

AP: కర్నూలు బస్సు ప్రమాదంలో 19మంది సజీవ దహనమైన విషయం తెలిసిందే. వీరిలో 18 మృతదేహాలను DNA పరీక్షల ఆధారంగా కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఓ గుర్తుతెలియని మృతదేహం కోసం చిత్తూరు(D) నుంచి ఒకరు వచ్చారని SP విక్రాంత్ తెలిపారు. తన తండ్రి కనిపించడంలేదని ఆ వ్యక్తి చెప్పినట్లు వివరించారు. DNA ఆధారంగా ఆ డెడ్బాడీ ఎవరిదన్నది తేలుతుందని చెప్పారు. ప్రమాద సమయంలో బస్సు డ్రైవర్ మద్యం తాగలేదని పేర్కొన్నారు.
News October 26, 2025
టాస్ గెలిచిన భారత్

WWC: లీగ్ స్టేజిలో చివరి మ్యాచ్లో BANతో భారత్ తలపడుతోంది. ముంబై వేదికగా జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచిన IND బౌలింగ్ ఎంచుకుంది. వర్షం పడుతుండటంతో ఆట కాస్త ఆలస్యమవనుంది.
IND: ప్రతీకా, స్మృతి, హర్లీన్, రోడ్రిగ్స్, హర్మన్ప్రీత్(C), దీప్తి, ఉమా, అమన్జోత్ కౌర్, రాధా యాదవ్, శ్రీచరణి, రేణుకా
BAN: సుమియా, రుబ్యా హైదర్, షర్మిన్, శోభన, సుల్తానా(C), షోర్నా, మోని, రబేయా, నహిదా, నిషితా, మరుఫా
News October 26, 2025
నారద భక్తి సూత్రాలు – 8

నిరోధస్తు లోకవేదవ్యాపార వ్యప:
మనం చేసే సాధారణ పనులైనా, దేవుడికి సంబంధించిన పనులైనా.. వాటి ఫలితం గురించి ఆలోచించకుండా ‘దేవుడా! నీ కోసమే చేస్తున్నాను’ అని వాటిని ఆయనకు అప్పగించాలని ఈసూత్రం సూచిస్తోంది. ఫలితంగా మన మనసులో ఆందోళన, స్వార్థం పోతాయని, మన ప్రతి పని దైవసేవగా మారుతుందని చెబుతోంది. ‘నేను చేస్తున్నాను’ అనే అహంకారం వదిలి ‘అంతా దేవుడే చేయిస్తున్నాడు’ అనే నమ్మకంతో ఉండటమే ఈ సూత్ర సారాంశం. <<-se>>#NBS<<>>


