News March 22, 2024

మోదీ, కేసీఆర్‌కు తేడా లేదు: సీఎం రేవంత్

image

TG: రాష్ట్రంలో KCR శకం ముగిసిందని, ఇక ఏం చేసినా ఆయనను ప్రజలు నమ్మరని CM రేవంత్ అన్నారు. ‘KCR అధికారంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడారు. ఇప్పుడేం మాట్లాడుతున్నారో ప్రజలు గమనిస్తున్నారు. ఆయన రాష్ట్రాన్ని అప్పులపాలు, అవినీతిమయం చేశారు. మోదీ, ఆయన ఒకే రకమైన నేతలు. అప్రజాస్వామిక విధానాలు, హామీలు ఇచ్చి అమలు చేయకుండా ప్రజలను మోసం చేయడంలో వారిద్దరికి తేడా లేదు’ అని ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు.

Similar News

News December 27, 2025

ఏ దానం చేస్తే ఏ ఫలితం?

image

1. బియ్యం: పాపాలు తొలుగుతాయి.
2. ప౦డ్లు:బుద్ధి, సిద్ధి కలుగుతాయి.
3. పెరుగు:ఇ౦ద్రియ నిగ్రహ౦ కలుగుతుంది.
4. నెయ్యి:రోగాలు పోతాయి. ఆరోగ్య౦గా ఉ౦టారు.
5. పాలు:నిద్ర లేమి సమస్య ఉండదు.
6. తేనె: స౦తానం కలుగుతుంది.
7. ఊసిరికాయలు: జ్ఞాపకశక్తి పెరుగుతు౦ది.
8. టె౦కాయ: అనుకున్న కార్య౦ సిద్ధిస్తు౦ది.
9. దీపదానం: క౦టి చూపు మెరుగు పడుతుంది.
10. వస్త్రదానం: ఆయుష్షు
11. అన్న దానం: ధనవృద్ధి పెరుగుతుంది.

News December 27, 2025

అగర్‌బత్తుల్లో ఆ కెమికల్స్‌పై బ్యాన్

image

ప్రపంచంలో అగర్‌బత్తుల అతిపెద్ద ఉత్పత్తిదారు, ఎగుమతిదారైన భారత్ వినియోగదారుల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని కీలక నిర్ణయం తీసుకుంది. BIS (Bureau of Indian Standards) ‘IS 19412:2025’ అనే కొత్త ప్రమాణాన్ని అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం అగర్‌బత్తుల తయారీలో హానికరమైన అలెత్రిన్, పెర్మెత్రిన్, సైపర్‌మెత్రిన్, డెల్టామెత్రిన్ వంటి క్రిమిసంహారకాలు, కొన్ని సింథటిక్ సువాసన రసాయనాల వినియోగాన్ని నిషేధించింది.

News December 27, 2025

ఈ జాగ్రత్తలు కూడా తీసుకుంటే మంచిది

image

శీతాకాలంలో పాడి పశువుల పాలు పితికే సమయాన్ని కూడా మార్చుకుంటే మంచిది. చలికాలంలో పగటి సమయం తక్కువగా, రాత్రి సమయం ఎక్కువగా ఉంటుంది. అందుకే పాలను ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్య, సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్య పితకడం మంచిదని పశు సంరక్షణా అధికారులు సూచిస్తున్నారు. అలాగే చలిగా ఉండే ఉదయం మరియు రాత్రివేళల్లో పశువులకు ఎండుగడ్డి, పొడి దాణా అందించాలి. పచ్చిగడ్డిని ఉదయం 11 గంటల ప్రాంతంలో అందిస్తే మంచిది.