News November 9, 2024

ఇవాళ సెలవు లేదు

image

TG: హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాల్లోని ప్రభుత్వ కార్యాలయాన్నీ రెండో శనివారమైనా ఇవాళ పనిచేయనున్నాయి. సెప్టెంబర్ 17న గణేశ్ నిమజ్జనం సందర్భంగా ఈ 3 జిల్లాల్లోని ప్రభుత్వ కార్యాలయాలకు ప్రభుత్వం సెలవు ఇచ్చింది. బదులుగా నవంబర్ 9న రెండో శనివారం సెలవు రద్దు చేసింది. దీంతో ఇవాళ ఈ 3 జిల్లాల్లోని ప్రభుత్వ కార్యాలయాలన్నీ యథావిధిగా పనిచేస్తాయి.

Similar News

News February 13, 2026

ధర్మంపై అధర్మమే గెలిచింది: పొంగులేటి సుధాకర్ రెడ్డి

image

ప్రస్తుత ఎన్నికల ఫలితాల్లో ధర్మంపై అధర్మమే విజయం సాధించిందని BJP జాతీయ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో డబ్బు రాజకీయాలే పైచేయి సాధించాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విజయం కేవలం “ధనబలంతో కూడిన రాజకీయాలదే తప్ప, ప్రజల నిజమైన తీర్పు కాదు. ప్రజలు ఈ విషయాన్ని త్వరలోనే గ్రహిస్తారు” అని అభిప్రాయపడ్డారు.

News February 13, 2026

డ్రాగన్ ఫ్రూట్‌తో మహిళలకు ఎన్నో లాభాలు

image

కలర్‌ఫుల్‌గా కనిపించే డ్రాగన్‌ ఫ్రూట్‌‌లో అనేక పోషకాలుంటాయి. ఇవి మహిళల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయంటున్నారు నిపుణులు. మహిళల్లో ఐరన్, ఫోలేట్, విటమిన్ సి లోపాన్ని భర్తీ చేస్తుంది. ముఖ్యంగా మెనోపాజ్‌ సమయంలో ఆస్టియో పోరోసిస్‌ ప్రమాదం ఎక్కువ. డ్రాగన్‌ ఫ్రూట్‌ను రెగ్యులర్‌గా తీసుకుంటే మెగ్నీషియం, క్యాల్షియం అంది ఎముకలు బలంగా తయారవుతాయి. అలాగే శరీరంలో కొల్లాజెన్‌ ఉత్పత్తి పెంచుతుందని చెబుతున్నారు.

News February 13, 2026

7 తరాలు మర్చిపోవు.. బిష్ణోయ్ గ్యాంగ్ వార్నింగ్

image

బాలీవుడ్ స్టార్స్ రణ్‌వీర్ సింగ్, రోహిత్ శెట్టిలకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ మరోసారి వార్నింగ్ ఇచ్చింది. ‘మా లైన్లోకి రాకపోతే (ఇటీవల రూ.10కోట్లు డిమాండ్ చేశారు) జరిగే పరిణామాలు వచ్చే 7 తరాలు మర్చిపోవు’ అని ఆడియో మెసేజ్‌లో రణ్‌వీర్‌ను హెచ్చరించింది. ‘మీ స్టాఫ్, వారి ఫ్యామిలీ మూమెంట్స్ సేకరించాం. వారిపై దాడి చేస్తే మీకు తెలిసి వస్తుందేమో’ అని గ్యాంగ్‌లోని హారీ బాక్సర్ పేరుతో వార్నింగ్ వచ్చింది.