News December 6, 2024
ఆ ఊరిలో 60 ఏళ్లుగా మొబైల్, టీవీ లేవు!

మొబైల్, టీవీ లేకుండా చాలామందికి రోజు గడవదు. కానీ అమెరికాలోని వెస్ట్వర్జీనియాలో గ్రీన్ బ్యాంక్ అనే ఊరిలో 60 ఏళ్లుగా టీవీ, సెల్ ఫోన్లను వాడటం లేదు. అందుకో కారణం ఉంది. అంతరిక్ష రేడియో తరంగాల అధ్యయనం కోసం 1958లో ఓ టెలిస్కోప్ను ఇక్కడ ప్రారంభించారు. ఫోన్లు, టీవీలు సహా ఫ్రీక్వెన్సీ కలిగిన పరికరాల్ని వాడితే ఆ తరంగాల వల్ల అధ్యయనం దెబ్బతింటుంది. అన్నట్లు.. అక్కడి జనాభా 141మంది మాత్రమే!
Similar News
News November 23, 2025
సంజూ మరో‘సారీ’

భారత ప్లేయర్ సంజూ శాంసన్కు వన్డేల్లో మరోసారి నిరాశే ఎదురైంది. దక్షిణాఫ్రికాతో వన్డేలకు ప్రకటించిన 15 మందితో కూడిన జట్టులో ఈ స్టార్ ప్లేయర్కు చోటు దక్కలేదు. జడేజా చాలా రోజుల తర్వాత వన్డేలకు ఎంపికయ్యారు. ఎన్నో రోజులుగా చోటు కోసం ఎదురుచూస్తున్న రుతురాజ్ సైతం టీమ్లోకి వచ్చారు. అయితే వన్డేల్లో మెరుగైన గణాంకాలు ఉన్నా రెండేళ్లుగా సంజూను ఎంపిక చేయకపోవడం దారుణమని ఆయన ఫ్యాన్స్ అంటున్నారు. మీ కామెంట్?
News November 23, 2025
ఆహా.. ఓహో! అంతా అరచేతిలో స్వర్గమేనా?

AP: ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్స్ అంటే పోటీ ప్రకటనలు, ప్రదర్శనల వేదికలుగా మారుతున్నాయా? జగన్ CMగా ఉండగా 340 కంపెనీలు ₹13 లక్షల కోట్ల పెట్టుబడికి ఆసక్తి చూపాయని నాటి ప్రభుత్వం చెప్పింది. ఇక 16 లక్షల ఉద్యోగాలు వచ్చేలా 625 కంపెనీలు ₹13.25 లక్షల కోట్ల ఇన్వెస్ట్కు ఇంట్రస్ట్ చూపాయని CBN తాజా ప్రభుత్వ స్టేట్మెంట్. వాస్తవ పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనలు ప్రకటనలకు దగ్గరగా ఉన్నాయా? అంటే ఆన్సర్ మీకు తెలుసుగా!
News November 23, 2025
రూ.485కే 72 రోజుల ప్లాన్

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL తక్కువ ధరకే కొత్త రీఛార్జ్ ప్లాన్లను ప్రవేశపెడుతూ కస్టమర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. తాజాగా 72 రోజుల స్మార్ట్ సేవింగ్ ప్లాన్ను తీసుకొచ్చింది. రూ.485తో రీఛార్జ్ చేస్తే అన్లిమిటెడ్ కాల్స్, రోజూ 2GB డేటా, 100 SMSలను అందిస్తున్నట్లు పేర్కొంది. ఇదే తరహా ప్లాన్లు మిగతా టెలికాం కంపెనీల్లో దాదాపు రూ.700-800 రేంజ్లో ఉన్నాయి.


