News January 31, 2025
ఇక లాభం లేదు.. పోరాటమే: KCR

TG: రాష్ట్రంలో మళ్లీ కరెంట్ కోతలు, నీళ్ల కరవు వచ్చాయని KCR ఆరోపించారు. ప్రశ్నిస్తే పోలీసులతో కేసులు పెట్టిస్తున్నారన్నారు. సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతలకు టెండర్లు ఎందుకు పిలవరు? అని ప్రశ్నించారు. వాటిని అడ్డుకోవడంలో మతలబేంటి? అని నిలదీశారు. ఓట్ల కోసం కాంగ్రెస్ ముస్లింలను వాడుకుందని ఆరోపించారు. గురుకులాల్లో అన్నీ సమస్యలే కనిపిస్తున్నాయని చెప్పారు. ఇక లాభం లేదు, ప్రత్యక్ష పోరాటమే శరణ్యమన్నారు.
Similar News
News September 17, 2025
ASIA CUP: పాక్-UAE మ్యాచ్ రిఫరీగా పైక్రాఫ్ట్

తమ మ్యాచ్కు రిఫరీగా ఆండీ పైక్రాఫ్ట్ను తప్పించాలన్న పాక్కు ICC షాక్ ఇచ్చింది. పాక్-UAE మ్యాచ్కు అతడినే రిఫరీగా కొనసాగిస్తోంది. మరోవైపు హ్యాండ్ షేక్ వివాదంపై పైక్రాఫ్ట్ తాజాగా తమకు క్షమాపణ చెప్పాడని పీసీబీ క్లెయిమ్ చేసుకోవడం గమనార్హం. అటు మ్యాచులో పాక్కు UAE షాక్ ఇస్తోంది. తొలి ఓవర్లో ఓపెనర్ అయూబ్ను డకౌట్గా వెనక్కి పంపింది. పాక్ 4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 17 పరుగులు చేసింది.
News September 17, 2025
హీరోయిన్ ఇంటిపై కాల్పులు.. నిందితుల ఎన్కౌంటర్

హీరోయిన్ దిశా పటానీ <<17692512>>ఇంటిపై<<>> కాల్పుల కేసులో నిందితులు పోలీసుల ఎన్కౌంటర్లో మరణించారు. UPలోని ఘజియాబాద్లో వారిని పట్టుకునే క్రమంలో ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో నిందితులు అరుణ్, రవీంద్ర మరణించారని పోలీసులు తెలిపారు. నిందితులు గోల్డీ బ్రార్ గ్యాంగ్ సభ్యులని పేర్కొన్నారు. సనాతన ధర్మాన్ని అగౌరవపరిచినందుకు హీరోయిన్ ఇంటిపై కాల్పులు జరిపినట్లు వారు వెల్లడించిన సంగతి తెలిసిందే.
News September 17, 2025
యథావిధిగా ఆరోగ్యశ్రీ సేవలు

TG: రాష్ట్రంలో <<17740234>>ఆరోగ్యశ్రీ<<>> సేవలు యథావిధిగా కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. 87 శాతం హాస్పిటళ్లు పేషెంట్లకు వైద్య సేవలు అందిస్తుండగా, కేవలం 13 శాతం హాస్పిటళ్లలోనే సేవలు ఆగాయని పేర్కొన్నారు. వైద్య సేవలు కొనసాగించాలని ఆరోగ్యశ్రీ CEO ఉదయ్ కుమార్ మరోసారి ఆయా ఆస్పత్రులకు విజ్ఞప్తి చేశారు. ఆరోగ్యశ్రీ కింద గత 2 వారాలుగా సగటున రోజుకు 844 సర్జరీలు నమోదవగా ఈరోజు 799 సర్జరీలు నమోదయ్యాయని వెల్లడించారు.