News November 25, 2024

ఏడు రాష్ట్రాల అసెంబ్లీల్లో ప్రతిపక్షం లేదు

image

దేశంలో ప్రతిపక్ష హోదా లేని అసెంబ్లీల సంఖ్య ఏడుకు చేరింది. ఇప్పటికే AP, అరుణాచల్, గుజరాత్, మణిపుర్, నాగాలాండ్, సిక్కిం ఈ జాబితాలో ఉండగా తాజాగా మహారాష్ట్ర చేరింది. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా దక్కాలంటే మొత్తం MLA స్థానాల్లో పది శాతం సీట్లను దక్కించుకోవాలి. మహారాష్ట్రలో 288 సీట్లు ఉండగా 29 సీట్లు గెలవాల్సి ఉంది. అయితే శివసేన(UBT)కు 20, కాంగ్రెస్‌కు 16, NCP(SP)కి 10 స్థానాలు మాత్రమే వచ్చాయి.

Similar News

News December 24, 2025

బల్లెం వీరుడికి HAPPY BIRTHDAY

image

ఇండియన్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా పుట్టినరోజు నేడు. టోక్యో ఒలింపిక్స్‌లో చారిత్రక స్వర్ణంతో దేశ దశాబ్దాల నిరీక్షణకు తెరదించారు. పారిస్ ఒలింపిక్స్‌లో రజతం సాధించి సత్తా చాటారు. వరల్డ్ ఛాంపియన్‌షిప్‌ గోల్డ్, డైమండ్ లీగ్ టైటిల్‌ గెలుచుకున్నారు. సైన్యంలో లెఫ్టినెంట్ కల్నల్ హోదా పొందారు. ఇటీవలే 90.23M త్రోతో రికార్డు సృష్టించిన నీరజ్.. మరిన్ని మెడల్స్ సాధించాలని నెటిజన్లు ఆకాంక్షిస్తున్నారు.

News December 24, 2025

చేవెళ్ల ప్రమాదం.. ప్రధాన నిందితుడిగా టిప్పర్ ఓనర్

image

TG: చేవెళ్ల సమీపంలోని మీర్జాగూడ వద్ద NOV 3న RTC బస్సు-టిప్పర్ ఢీకొన్న <<18212535>>ఘటనలో<<>> టిప్పర్ డ్రైవర్ సహా18 మంది ప్రయాణికులు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ కేసులో టిప్పర్ ఓనర్ లచ్చు నాయక్‌ను పోలీసులు తాజాగా ప్రధాన నిందితుడిగా చేర్చారు. టిప్పర్ ఓవర్ లోడే ప్రమాదానికి కారణమని, ఆ సమయంలో అతడు టిప్పర్‌లోనే ఉన్నాడని తేల్చారు. ఈ ప్రమాదంలో గాయపడిన లచ్చు నాయక్ ప్రస్తుతం కోలుకుంటున్నాడు.

News December 24, 2025

మాల్యా భారత్‌కు ఎప్పుడు వస్తారు: బాంబే హైకోర్టు

image

బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి బ్రిటన్‌కు పారిపోయిన విజయ్ మాల్యాకు బాంబే హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. “భారత్‌కు ఎప్పుడు వస్తారు?” అనేది రాతపూర్వక అఫిడవిట్ ఇవ్వాలని ఆదేశించింది. విదేశాల్లో ఉంటూ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్లను విచారించబోమని స్పష్టం చేసింది. నేర విచారణ నుంచి తప్పించుకుని.. విదేశాల్లో ఉంటూ చట్టాన్ని సవాలు చేయడం సరికాదని ఈడీ తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదించారు.