News November 25, 2024
ఏడు రాష్ట్రాల అసెంబ్లీల్లో ప్రతిపక్షం లేదు

దేశంలో ప్రతిపక్ష హోదా లేని అసెంబ్లీల సంఖ్య ఏడుకు చేరింది. ఇప్పటికే AP, అరుణాచల్, గుజరాత్, మణిపుర్, నాగాలాండ్, సిక్కిం ఈ జాబితాలో ఉండగా తాజాగా మహారాష్ట్ర చేరింది. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా దక్కాలంటే మొత్తం MLA స్థానాల్లో పది శాతం సీట్లను దక్కించుకోవాలి. మహారాష్ట్రలో 288 సీట్లు ఉండగా 29 సీట్లు గెలవాల్సి ఉంది. అయితే శివసేన(UBT)కు 20, కాంగ్రెస్కు 16, NCP(SP)కి 10 స్థానాలు మాత్రమే వచ్చాయి.
Similar News
News November 18, 2025
ఇతరులకు ఇబ్బంది కలిగించకపోతేనే వాస్తు ఫలితాలు

మనం మన పరిధిలో, ఇతరులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, వాస్తును దృష్టిలో పెట్టుకుని నిర్మాణాలు చేపట్టాలని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. కేవలం మన సౌకర్యమే కాక, సామాజిక ధర్మాన్ని కూడా పాటించడం ముఖ్యమంటున్నారు. ఇతరుల హక్కులకు భంగం కలగకుండా నిర్మాణాలు చేయడం వల్ల శాస్త్రరీత్యా, ధర్మబద్ధంగా అందరికీ శుభం, శ్రేయస్సు కలుగుతుందని చెబుతున్నారు. <<-se>>#Vasthu<<>>
News November 18, 2025
ఇతరులకు ఇబ్బంది కలిగించకపోతేనే వాస్తు ఫలితాలు

మనం మన పరిధిలో, ఇతరులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, వాస్తును దృష్టిలో పెట్టుకుని నిర్మాణాలు చేపట్టాలని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. కేవలం మన సౌకర్యమే కాక, సామాజిక ధర్మాన్ని కూడా పాటించడం ముఖ్యమంటున్నారు. ఇతరుల హక్కులకు భంగం కలగకుండా నిర్మాణాలు చేయడం వల్ల శాస్త్రరీత్యా, ధర్మబద్ధంగా అందరికీ శుభం, శ్రేయస్సు కలుగుతుందని చెబుతున్నారు. <<-se>>#Vasthu<<>>
News November 17, 2025
గిగ్ వర్కర్ల బిల్లుకు క్యాబినెట్ ఆమోదం

TG: గిగ్, ప్లాట్ఫామ్ ఆధారిత వర్కర్లకు సామాజిక భద్రత, భరోసా కల్పించడానికి ఉద్దేశించిన బిల్లుకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. దీంతో ఫుడ్ డెలివరీ, క్యాబ్ డ్రైవర్లు, ప్యాకేజీ డెలివరీల్లో పనిచేస్తున్న 4 లక్షల మంది ప్రయోజనం పొందే అవకాశం ఉంది. గిగ్ వర్కర్లు వివరాలను నమోదు చేసుకోవాలని మంత్రి వివేక్ సూచించారు. త్వరలో అసెంబ్లీలో గిగ్ వర్కర్ల బిల్లును ప్రవేశపెడతామని వెల్లడించారు.


