News September 1, 2024
సినీ పరిశ్రమలో పవర్ సెంటర్ లేదు: మమ్ముట్టి
కోలీవుడ్లో పవర్ సెంటర్ అంటూ ఏం లేదని నటుడు మమ్ముట్టి అన్నారు. జస్టిస్ హేమ కమిటీ నివేదికపై ఆర్టిస్టుల సంఘం స్పందించే వరకు తాను ఎదురుచూసినట్టు పేర్కొన్నారు. కమిటీ చేసిన సలహాలు, పరిష్కారాలను స్వాగతించిన మమ్ముట్టి పరిశ్రమలో సంస్కరణలు తేవడానికి అన్ని సంఘాలు ఏకం కావాలని కోరారు. పోలీసుల విచారణను ప్రతి ఒక్కరూ అనుమతించాలని, శిక్షలను కోర్టు నిర్ణయించనివ్వాలని అన్నారు.
Similar News
News February 1, 2025
ట్రంప్ ప్రతిపాదన తిరస్కరణ
గాజాలోని పాలస్తీనీయులకు పొరుగు దేశాల్లో పునరావాసం కల్పించాలన్న ట్రంప్ ప్రతిపాదనను ఆయా దేశాలు తిరస్కరించాయి. ఈ మేరకు ఈజిప్ట్, జోర్డాన్, సౌదీ అరేబియా, UAE, ఖతర్, పాలస్తీనా అథారిటీ, అరబ్ లీగ్లు సంయుక్త ప్రకటన చేశాయి. ఇజ్రాయెల్ దాడులతో గాజా శిథిలాల కుప్పగా మారడంతో పాటు కనీస సౌకర్యాలు కరవయ్యాయని, వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ట్రంప్ ఇటీవల ఆయా దేశాలకు ప్రతిపాదించిన విషయం తెలిసిందే.
News February 1, 2025
అకౌంట్లోకి రూ.20,000.. కీలక ప్రకటన
AP: ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తామని రాయచోటి సభలో సీఎం చంద్రబాబు వెల్లడించారు. పెన్షన్లు పెంచి పేదల జీవితాల్లో వెలుగులు నింపామన్న ఆయన ఆడబిడ్డలకు ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నామన్నారు. కేంద్రం ఇచ్చే నిధులతో కలిపి రైతు భరోసా కింద రూ.20వేలు మే నెలలో అందిస్తామన్నారు. అలాగే తల్లికి వందనం పథకాన్ని ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామని ప్రకటించారు.
News February 1, 2025
శ్రీలంకను మట్టికరిపించిన ఆసీస్
తొలి టెస్టులో SLను ఆస్ట్రేలియా మట్టికరిపించింది. గాలే వేదికగా జరిగిన టెస్టులో వార్ వన్ సైడ్ అయింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 654-6 వద్ద డిక్లేర్ చేసింది. తొలి INGలో 165కే ఆలౌట్ అయిన శ్రీలంక ఫాలో ఆన్ ఆడింది. 4వ రోజు అందులోనూ 247 పరుగులకే ఆలౌట్ కావడంతో ఆసీస్ ఓ ఇన్నింగ్స్ & 242 రన్స్ తేడాతో గెలుపొందింది. టెస్టుల్లో AUSకు ఇది నాలుగో అతిపెద్ద విజయం. డబుల్ సెంచరీ చేసిన ఖవాజాకు POTM అవార్డు దక్కింది.