News May 10, 2024
తగ్గేదే లే.. ఓటుకి రూ.2వేల నుంచి రూ.3వేలు!

AP: ఎన్నికల ప్రచార గడువు రేపటితో ముగియనుండగా తాయిలాల పర్వానికి తెర లేచింది. నగదు పంపిణీకి పార్టీలు సిద్ధమయ్యాయి. ఇప్పటికే చాలా చోట్ల డబ్బు పంచుతున్నట్లు పత్రికల కథనాలు పేర్కొంటున్నాయి. ప్రధాన పార్టీలకు ఈ ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా మారిన వేళ ఖర్చుకు వెనకాడటం లేదని తెలుస్తోంది. ఓటుకు రూ.2వేల నుంచి రూ.3 వేలు.. ప్రముఖులు, ఉత్కంఠ పోరు నెలకొన్న స్థానాల్లో అంతకంటే ఎక్కువే ఇస్తున్నట్లు సమాచారం.
Similar News
News November 24, 2025
జాతీయ స్థాయి విలువిద్య పోటీలకు పాడేరు విద్యార్థి ఎంపిక

పాడేరు శ్రీ మోదమాంబ విద్యాలయంలో పదో తరగతి విద్యార్థి సీహెచ్ మోహిత్ సాయి రాష్ట్ర సబ్జూనియర్ విలువిద్య పోటీల్లో రెండో స్థానం సాధించి జాతీయ స్థాయికి ఎంపికయ్యాడు. అరుణాచల్ ప్రదేశ్లో నిర్వహించనున్న జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొననున్న విద్యార్థికి కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ సోమవారం ఆర్థిక సహాయం అందించి అభినందనలు తెలిపారు. క్రీడా అధికారి జగన్మోహన్ రావు, కోచ్ సుధాకర్ నాయుడు ఉన్నారు.
News November 24, 2025
అక్రమ మైనింగ్.. ఎమ్మెల్యే సోదరుడి ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ

TG: పటాన్చెరు MLA మహిపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్కు చెందిన సంతోష్ శాండ్ అండ్ గ్రానైట్ కంపెనీ అక్రమ మైనింగ్ చేసిందని ఈడీ గుర్తించింది. అనుమతి లేకుండా, పరిమితికి మించి మైనింగ్ చేస్తూ రూ.300 కోట్లకుపైగా అక్రమాలకు పాల్పడినట్లు పేర్కొంది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.39Cr రాయల్టీ చెల్లించలేదని తెలిపింది. ఈ మేరకు మధుసూదన్కు చెందిన రూ.80 కోట్లు అటాచ్ చేసినట్లు ప్రకటనలో వెల్లడించింది.
News November 24, 2025
ఎల్లుండి ఇలా చేస్తే వివాహ సమస్యలు దూరం!

ఎల్లుండి సుబ్రహ్మణ్య షష్ఠి. దీనిని స్కందషష్ఠి అని కూడా పిలుస్తారు. ఈరోజున సుబ్రహ్మణ్య ఆరాధన, సుబ్రహ్మణ్య భుజంగ స్త్రోత్ర పారాయణం, వల్లీ-దేవసేన కళ్యాణం వంటివి చేయాలని పండితులు సూచిస్తున్నారు. ఇవి చేస్తే జాతక పరంగా వివాహ సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, పిల్లల బుద్ధి కుశలత, ఆరోగ్య సమస్యలకు పరిష్కారం లభిస్తుందని చెబుతున్నారు. SHARE IT


