News July 31, 2024
రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదు: సబితా ఇంద్రారెడ్డి

TG: రాష్ట్రంలో స్త్రీలకు భద్రత కరవైందని, వరుస అత్యాచారాలు ఆందోళన కలిగిస్తున్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. అసెంబ్లీలో చర్చించి 48 గంటలైనా గడవక ముందే 4 అత్యాచారాలు జరిగాయన్నారు. ఇవి ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాల్సిన ఘటనలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరవాలని, ఇలాంటివి పునరావృతం కాకుండా ఆపాలని ఆమె సూచించారు.
Similar News
News February 25, 2026
ఘోష్ కమిషన్ నివేదిక చెల్లదు: హైకోర్టులో హరీశ్ తరఫు లాయర్

TG: కాళేశ్వరంపై ఘోష్ కమిషన్ రిపోర్టును రద్దు చేయాలని BRS చీఫ్ KCR, హరీశ్ రావు, స్మితా సబర్వాల్ వేసిన పిటిషన్లను హైకోర్టు ఇవాళ విచారించింది. PC ఘోష్ కమిషన్ పరిధి దాటి వ్యవహరించిందని హరీశ్ తరఫు న్యాయవాది సుందరం కోర్టుకు నివేదించారు. కమిషన్ ఆఫ్ ఎంక్వయిరీస్ చట్టం ప్రకారం ఘోష్ నివేదిక చెల్లదని విన్నవించారు. కాగా విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది. KCR తరఫు న్యాయవాది రేపు వాదనలు వినిపించనున్నారు.
News February 25, 2026
ఊరిలో సగం మంది కవలలే..!

కేరళలోని కొడిన్హి గ్రామం ప్రపంచాన్నే ఆశ్చర్యపరుస్తోంది. సాధారణంగా వెయ్యి జననాల్లో కేవలం నలుగురు కవలలు పుడితే ఇక్కడ ఆ సంఖ్య ఏకంగా 45కి పైగా ఉంది. సుమారు 2,000 కుటుంబాలున్న ఆ ఊరిలో 400కు పైగా కవల జంటలు నివసిస్తున్నాయి. దీనికి గల కారణాలు తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు, డాక్టర్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇప్పటికీ సరైన సమాధానం దొరకలేదు. ఇలాంటి వింతైన విషయాలు ‘వంద రోజుల్లో- వంద వింతలు’ ఎపిసోడ్లో..
News February 25, 2026
T20 WC: కివీస్తో మ్యాచ్.. లంక బౌలింగ్

న్యూజిలాండ్తో జరుగుతున్న కీలక మ్యాచులో శ్రీలంక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. సూపర్-8లో ఇప్పటికే ఇంగ్లండ్ చేతిలో ఓడిన లంక ఈ మ్యాచులో గెలిస్తేనే సెమీస్ ఆశలు సజీవంగా ఉంటాయి. ఓడితే ఇంటిబాట పడుతుంది. అటు పాక్తో మ్యాచు వర్షం కారణంగా రద్దవడంతో కివీస్కూ ఈ మ్యాచులో గెలవడం తప్పనిసరిగా మారింది. టీమ్స్ వివరాలు పైన ఇమేజ్లో చూడొచ్చు. మరి ఇవాళ ఎవరు విజయం సాధిస్తారని అనుకుంటున్నారు? COMMENT


