News July 19, 2024

రత్న భాండాగార్‌లో అలాంటివేం లేవు: జస్టిస్ రథ్

image

పూరీలోని రత్న భాండాగార్‌లో సర్పాలు, విష కీటకాలు, రహస్య సొరంగ మార్గాలు లాంటివి ఏమీ లేవని సూపర్‌వైజరీ కమిటీ ఛైర్మన్ జస్టిస్ బిశ్వనాథ్ రథ్ తెలిపారు. ఆలయం లోపల సొరంగ మార్గాలు ఏమైనా ఉంటే ఏఎస్ఐ లేజర్ స్కానింగ్ చేస్తే తెలుస్తుందన్నారు. సంపదనంతా భద్రపరిచి సీల్ చేయించామని చెప్పారు. సంపద వివరాలు ఎక్కడా బహిర్గతం చేయకూడదని ప్రతిజ్ఞ చేసినందున వాటి వివరాలు వెల్లడించలేమని తెలిపారు.

Similar News

News October 28, 2025

మరికాసేపట్లో తీవ్ర తుఫానుగా ‘మొంథా’!

image

AP: ‘మొంథా’ తుఫాను దూసుకొస్తోంది. గడిచిన 6గంటల్లో 17kmph వేగంతో కదులుతున్నట్లు APSDMA తెలిపింది. ప్రస్తుతం మచిలీపట్నంకి 230KM, కాకినాడకు 310KM, విశాఖపట్నంకి 370KM దూరంలో కేంద్రీకృతమైందని చెప్పింది. మరికాసేపట్లో తీవ్ర తుఫానుగా బలపడనుందని వివరించింది. రాత్రికి మచిలీపట్నం-కాకినాడ మధ్య తీరం దాటే ఛాన్స్ ఉందని పేర్కొంది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రావొద్దని హెచ్చరించింది.

News October 28, 2025

ఇతిహాసాలు క్విజ్ – 49

image

1. శ్రీరామదాసుగా ప్రసిద్ధి చెందిన రామ భక్తుడు ఎవరు?
2. భూలోకానికి పైన ఉండే మొదటి లోకం ఏది?
3. రామ సేతువు నిర్మాణంలో ప్రధాన ఇంజినీర్లు ఎవరు?
4. యుద్ధాన్ని చూస్తూ దాన్ని ధృతరాష్ట్రునికి వివరించింది ఎవరు?
5. శివుడు తన జటాజూటంలో బంధించిన నది ఏది?
✑ సరైన సమాధానాలను సాయంత్రం 6 గంటలకు పబ్లిష్ చేస్తాం.
<<-se>>#Ithihasaluquiz<<>>

News October 28, 2025

అక్టోబరు ఆఖరు నుంచి మామిడి చెట్లకు నీరు వద్దు

image

మామిడిలో మంచి పూత రావాలంటే రైతులు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. అందులో భాగంగా ఇప్పటికే చెట్లకు పోషకాలు అందించాల్సి ఉంటుంది. ఈ నెల చివరి నుంచి మామిడి చెట్లు నిద్రావస్థలో ఉంటాయి. అందుకే ఈ నెలాఖరు నుంచి మామిడి చెట్లకు నీరు పెట్టడం పూర్తిగా ఆపేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. ఈ కాలంలో చెట్లకు నీరు పెట్టడం వల్ల చెట్ల రెమ్మల్లో కొత్త ఇగుర్లు వచ్చి పూత రాకుండా పోతుందని చెబుతున్నారు.