News August 14, 2024

ఆ ప్రచారంలో నిజం లేదు: RTC MD సజ్జనార్

image

TG: బస్సు డిపోలు ప్రైవేట్‌ పరమవుతాయనే ప్రచారంలో నిజం లేదని RTC MD సజ్జనార్ స్పష్టం చేశారు. TGSRTC ఆధ్వర్యంలోనే బస్సుల నిర్వహణ ఉంటుందన్నారు. ఎలక్ట్రిక్‌ బస్సులను అన్ని రూట్లలో తిప్పడం సాధ్యపడదన్నారు. ప్రతి డిపోలోనూ ఎలక్ట్రిక్‌, డీజిల్‌ బస్సులు నడుస్తాయన్నారు. ప్రైవేట్ అద్దె బస్సుల్లాగే ఎలక్ట్రిక్ బస్సులన్నీ TGSRTC ఆధ్వర్యంలోనే నడుస్తాయని, ఆదాయం నేరుగా సంస్థకే వస్తుందని వెల్లడించారు.

Similar News

News July 4, 2025

11 ఏళ్లలో TGకి మోదీ ఏం ఇచ్చారు?: ఖర్గే

image

TG: కార్యకర్తల కృషి వల్లే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని AICC చీఫ్ ఖర్గే పేర్కొన్నారు. LB స్టేడియంలో సామాజిక న్యాయ సమరభేరి సభలో మాట్లాడుతూ ‘రేవంత్, భట్టి కలిసి KCRను ఓడించి కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాం. HYDలోని పెద్ద పరిశ్రమలన్నీ కాంగ్రెస్ హయాంలోనే వచ్చాయి. 11 ఏళ్లలో TGకి మోదీ ఏం ఇచ్చారు? రూ.15 లక్షలు, ఏటా 2 కోట్ల జాబ్స్ ఇచ్చారా’ అని వ్యాఖ్యానించారు.

News July 4, 2025

భారత్‌కు డ్రాగన్ బిగ్ వార్నింగ్

image

టిబెట్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని భారత్‌ను చైనా హెచ్చరించింది. దలైలామా వారసుడి ఎంపిక నిర్ణయం టిబెట్ చూసుకుంటుందని, ఇందులో ఇండియా తలదూర్చకూడదని స్పష్టం చేసింది. ఒకవేళ ఈ విషయంలో జోక్యం చేసుకుంటే ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతినే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. దీనిపై భారత్ స్పందించాల్సి ఉంది.

News July 4, 2025

ఖాళీ అవుతోన్న ‘తువాలు’

image

పసిఫిక్ మహాసముద్రంలోని కేవలం 5 మీటర్ల ఎత్తులో ఉండే ‘తువాలు’ దేశం ఖాళీ అవుతోంది. కొన్ని దీవుల సముదాయమైన ఈ దేశంలోని మెజారిటీ భూభాగం 2050 నాటికి సముద్రంలో కలిసిపోతుందని NASA హెచ్చరించడంతో ప్రజలు వలస వెళ్లిపోతున్నారు. ఈక్రమంలో ఆస్ట్రేలియాతో జరిగిన ఒప్పందంతో ‘క్లైమెట్ వీసా’ కోసం దేశంలోని 10643 మందిలో మూడో వంతు ప్రజలు అప్లై చేసుకున్నారు. కానీ ఏడాదికి 280 మందిని లాటరీ ద్వారా ఎంపిక చేస్తారు.