News September 4, 2025

విద్యార్థులు ప్లేట్లు కడగడం సిగ్గుపడేదేం కాదు: CJ AK సింగ్

image

TG: ప్రభుత్వ హాస్టల్స్‌లో విద్యార్థులు ప్లేట్లు, టాయిలెట్లు కడగడం సిగ్గుపడాల్సిన పనేం కాదని హైకోర్టు CJ AK సింగ్ పేర్కొన్నారు. హాస్టళ్లలో ఫుడ్ పాయిజనింగ్ ఘటనలపై దాఖలైన పిల్‌పై విచారణ చేపట్టారు. ‘చదువుకునేటప్పుడు నేనూ ప్లేట్లు కడిగాను, టాయిలెట్లు క్లీన్ చేశాను. అదేం తప్పుకాదు. ఈ ఘటనలపై వివరణ, నివారణ చర్యల గురించి తెలియజేయాలి’ అని ప్రభుత్వాన్ని ఆదేశించారు. తదుపరి విచారణ SEP 19కి వాయిదా వేశారు.

Similar News

News September 4, 2025

జాగృతిలో చీలికలు.. BRS కోసమే పనిచేస్తామంటున్న నేతలు

image

TG: బీఆర్ఎస్‌ను కవిత వీడటంతో దాని అనుబంధ సంస్థగా ఉన్న జాగృతిలో చీలికలు బయటపడుతున్నాయి. కవిత తమను నడిరోడ్డుపై పడేసిందని జాగృతి నేత రాజీవ్ సాగర్ ఆరోపించారు. బీఆర్ఎస్ కోసం పనిచేసే తెలంగాణ జాగృతి తమదేనని, కేసీఆర్ చెప్పిందే చేస్తామని చెప్పారు. తెలంగాణ జాగృతి బోర్డు పెట్టుకునే హక్కు తమకు ఉందన్నారు. దీనిపై జాగృతి ఫౌండర్ కవిత స్పందించాల్సి ఉంది.

News September 4, 2025

చైనా హ్యాకర్ల చేతిలో అమెరికన్ల డేటా!

image

అమెరికాను ‘సాల్ట్ టైఫూన్’ అనే పేరు భయపెడుతోంది. చైనాకు చెందిన ఈ సైబర్ ముఠా అమెరికాలోని ప్రతి పౌరుడి డేటాను హ్యాక్ చేసిందని సెక్యూరిటీ నిపుణులు భయపడుతున్నారు. ఈ ముఠా 2019 నుంచి 80 దేశాల్లో 200 కంపెనీలను లక్ష్యంగా చేసుకుందని చెబుతున్నారు. ఈ భారీ ఎటాక్ చైనా హ్యాకింగ్ సామర్థ్యాలను తెలియజేస్తోందని NYT కథనం పేర్కొంది. చైనా ప్రభుత్వమే వీరికి నిధులు ఇస్తుందని ఆరోపించింది.

News September 4, 2025

జీఎస్టీ తగ్గింపుతో సామాన్యులకు ఎన్ని రూ.వేలు సేవ్ అంటే?

image

పండగల వేళ GST శ్లాబులను తగ్గిస్తూ సామాన్యులకు కేంద్రం పెద్ద గిఫ్ట్ ఇచ్చింది. ఆహార పదార్థాలు, హెల్త్ ఇన్సూరెన్స్, ఇతరత్రా <<17605715>>వస్తువులపై<<>> GSTని తగ్గించడం బిగ్ రిలీఫ్ కలిగించింది. దీంతో మధ్య తరగతి కుటుంబాలకు ఏటా రూ.45వేలు ఆదా అవుతుందని ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. రూ.12 లక్షల వరకు ఇన్‌కమ్ ట్యాక్స్ లేదన్న గత ప్రకటనతో పాటు జీఎస్టీ ఆదా కలిపి ఏటా రూ.1.25లక్షలు సేవ్ అవుతాయని అంచనా వేస్తున్నారు.