News December 23, 2024

800 మందికి ఓ వైద్యుడున్నాడు!

image

ఇండియాలో వైద్యుల సంఖ్య, వారికి ఎదురయ్యే సమస్యలపై ఓ వైద్యుడు చేసిన ట్వీట్ వైరలవుతోంది. ‘ప్రస్తుతం ఆధునిక వైద్యం చదివిన వైద్యులు 13 లక్షలు, ఆయుష్ వైద్యులు దాదాపు 6 లక్షల మంది ఉన్నారు. ప్రస్తుతం ప్రతి 800 మందికి ఒక వైద్యుడు ఉన్నారు. అయితే పని ఒత్తిడితో వైద్యులు మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. సామాన్యుల కంటే పదేళ్ల ముందే చనిపోతున్నారు. జూ.డాలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు’ అని Xలో రాసుకొచ్చారు.

Similar News

News January 19, 2026

ఎన్నికల నగారా.. ఫిబ్రవరి 14న పోలింగ్?

image

TG: మున్సిపల్ ఎన్నికలకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ నెల 21న షెడ్యూల్, ఫిబ్రవరి 14న పోలింగ్ నిర్వహించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. అటు అభ్యర్థుల ఎంపిక, సీట్ల సర్దుబాటుపై పార్టీలు తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు నేతలు వ్యూహాలు పన్నుతున్నారు. మరి ‘ప్రేమికుల రోజు’ ఓటర్లు ఎవరిపై ప్రేమ కురిపిస్తారో చూడాలి.

News January 19, 2026

FEB 9న AP మెడికల్ కౌన్సిల్ ఎన్నిక

image

AP మెడికల్ కౌన్సిల్ ఎన్నిక FEB 9న జరగనుంది. ఈనెల 27వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ‘మండలిలో సభ్యత్వం కలిగిన 55,504 మంది వైద్యుల్లో రాష్ట్రంలో ఐదేళ్లకు పైబడి ఉంటున్న వారు పోటీకి అర్హులు. సభ్యులు ఎక్కడ్నుంచైనా ఆన్‌లైన్, మొబైల్ ద్వారా ఓటు వేయొచ్చు. దీనికోసం APMC ఆన్‌లైన్ ఎలక్షన్ పోర్టల్‌లో లాగిన్ కావాలి’ అని డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ చక్రధరబాబు వెల్లడించారు. కాగా APMCకి 13 మందిని ఎన్నుకుంటారు.

News January 19, 2026

అలా అయితే మేమూ T20 WC ఆడబోం.. పాక్ వితండవాదం!

image

T20 WC విషయంలో ఇప్పటికే బంగ్లా లేనిపోని రాద్ధాంతం చేస్తుంటే తాజాగా పాక్ అందుకు వంత పాడుతోంది. బంగ్లాను ఇండియాలో ఆడాలని ICC ఫోర్స్ చేస్తే, తాము కూడా టోర్నీ నుంచి తప్పుకొంటామంటూ వితండవాదానికి దిగింది. బంగ్లాదేశ్ అభ్యర్థన న్యాయమైందని, వారిపై ఒత్తిడి తేవొద్దంటూ లేనిప్రేమ ఒలకబోస్తోంది. ఈ మేరకు పాక్ క్రికెట్ బోర్డులోని విశ్వసనీయ వర్గాలను పేర్కొంటూ అక్కడి మీడియాలో కథనాలు ప్రచురితమయ్యాయి.