News December 23, 2024
800 మందికి ఓ వైద్యుడున్నాడు!

ఇండియాలో వైద్యుల సంఖ్య, వారికి ఎదురయ్యే సమస్యలపై ఓ వైద్యుడు చేసిన ట్వీట్ వైరలవుతోంది. ‘ప్రస్తుతం ఆధునిక వైద్యం చదివిన వైద్యులు 13 లక్షలు, ఆయుష్ వైద్యులు దాదాపు 6 లక్షల మంది ఉన్నారు. ప్రస్తుతం ప్రతి 800 మందికి ఒక వైద్యుడు ఉన్నారు. అయితే పని ఒత్తిడితో వైద్యులు మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. సామాన్యుల కంటే పదేళ్ల ముందే చనిపోతున్నారు. జూ.డాలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు’ అని Xలో రాసుకొచ్చారు.
Similar News
News December 3, 2025
నేడు రెండు జిల్లాల్లో సీఎం పర్యటన

AP: సీఎం చంద్రబాబు ఇవాళ రెండు జిల్లాల్లో పర్యటించనున్నారు. 10.55AMకు తూ.గో. జిల్లా నల్లజర్లలో జరగనున్న ‘రైతన్నా.. మీ కోసం’ వర్క్ షాప్లో ఆయన పాల్గొంటారు. అనంతరం ప్రజావేదిక సభలో రైతులు, రైతు కుటుంబాలతో ముఖాముఖి నిర్వహిస్తారు. 1.45PM నుంచి 3.15PM వరకు కార్యకర్తల సమావేశంలో సీఎం పాల్గొననున్నారు. 6PMకు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం చేరుకొని అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ కార్యక్రమానికి హాజరవుతారు.
News December 3, 2025
రేపే దత్త జయంతి.. ఏం చేయాలంటే?

త్రిమూర్తుల స్వరూపమే దత్తాత్రేయస్వామి. అందుకే ఆయనకు 3 తలలుంటాయి. రేపు ఆయన జయంతి. ఈ సందర్భంగా ఆయనను పూజిస్తే.. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ఆరాధనా ఫలితం దక్కుతుందని నమ్మకం. ఆయన చిత్రపటం, విగ్రహానికి పసుపు రంగు పూలతో అలంకరించి, పులిహోరా, నిమ్మకాయలు వంటి పసుపు రంగు నైవేద్యాలు సమర్పిస్తే.. శని బాధలు, అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని నమ్మకం. ఈ పవిత్రమైన రోజున ఆయన అనుగ్రహం పొందితే జీవితంలో శుభాలు కలుగుతాయి.
News December 3, 2025
భారత్ సిరీస్ పట్టేస్తుందా?

IND, SA మధ్య నేడు రాయ్పూర్లో రెండో వన్డే జరగనుంది. 1-0తో ఆధిక్యంలో ఉన్న భారత్ ఇవాళ గెలిచి సిరీస్ను కైవసం చేసుకోవాలని చూస్తోంది. అటు సిరీస్ ఫలితాన్ని 3వ వన్డేకు వాయిదా వేయాలనే పట్టుదలతో సఫారీ జట్టు ఉంది. గాయంతో తొలి వన్డేకు దూరమైన బవుమా జట్టులో చేరే ఆస్కారం ఉంది. రోహిత్, కోహ్లీ ఫామ్లో ఉండటం భారత్కు కలిసొచ్చే అంశం. సుందర్ ప్లేస్లో తిలక్ జట్టులోకి రావొచ్చని టాక్. మ్యాచ్ 1.30PMకు మొదలవుతుంది.


