News January 28, 2025
రాజకీయాల్లో ఒత్తిడి ఉంటుంది.. సంసిద్ధమై రావాలి: అయోధ్య

AP: విజయసాయిరెడ్డి రాజీనామా ఆయన వ్యక్తిగత విషయమని MP అయోధ్య రామిరెడ్డి తెలిపారు. ప్రస్తుత రాజకీయాల్లో నంబర్స్ గేమ్ నడుస్తోందని, అందువల్ల ప్రజాప్రతినిధులపై ఒత్తిడి ఉంటుందన్నారు. అన్నిరకాలుగా సంసిద్ధమై రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందని చెప్పారు. ప్రస్తుత పరిణామాలతో YCPకి భవిష్యత్తు లేదనడం సరికాదని తెలిపారు. ఓటమి ఎదురైనప్పుడు సమస్యలు, సవాళ్లు ఉంటాయని.. వాటిని తట్టుకుంటేనే మనుగడ సాధ్యమన్నారు.
Similar News
News November 12, 2025
‘తడిసిన ధాన్యం కొనుగోలుకు నిబంధనలు సవరించేలా చూడండి’

AP: మొంథా తుఫాన్ నష్టంపై వేగంగా నివేదిక ఇచ్చి.. రాష్ట్రాన్ని ఉదారంగా ఆదుకోవాలని కేంద్ర బృందాన్ని సీఎం చంద్రబాబు కోరారు. తుఫాన్ వల్ల రూ.6,384 కోట్ల నష్టం వాటిల్లిందని, తక్షణ సాయంగా రూ.2,622 కోట్లు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన కేంద్రం బృందం CMతో సమావేశమైంది. తడిసిన ధాన్యం కొనుగోలుకు నిబంధనలు సవరించేలా కేంద్రానికి సిఫార్సు చేయాలని బృంద సభ్యులను సీఎం కోరారు.
News November 12, 2025
SBIలో మేనేజర్ పోస్టులు

<
News November 12, 2025
వేగం వద్దు.. ఇలా కూడా ఆనందపడవచ్చు!

బైక్, కార్లలో వేగంగా ప్రయాణించడం ద్వారా పొందే తాత్కాలిక సంతోషం కంటే, దైవ స్మరణలో నిమగ్నమై ఆ దైవత్వం గొప్పతనాన్ని తెలుసుకుంటే మనిషికి అంతకన్నా ఉన్నత స్థాయి ఉండదు. జీవితంలో నిజమైన ఆనందం ఆ వేగంలో లేదు. పరమాత్మ సృష్టించిన లోకంలోనే ఉంది. కోయిల నాదంలో, కురిసే చినుకులో, పూసే పూవులో, చిన్నపిల్లల మాటల్లో ఆ ఆనందాన్ని అనుభవించాలి. నిస్వార్థంగా ఇతరులకు చేసే సాయంలో లభించే సంతృప్తి ఎంతో గొప్పది.


