News April 19, 2024
అక్కడ 6 జిల్లాల్లో జీరో ఓటింగ్.. కారణం ఇదే

నాగాలాండ్లో ఒకే ఒక్క లోక్సభ స్థానానికి ఇవాళ పోలింగ్ జరిగింది. కానీ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ నేపథ్యంలో 6 జిల్లాల్లో జీరో ఓటింగ్ నమోదైంది. నాగాలాండ్ నుండి ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్న తూర్పు నాగాలాండ్ పీపుల్స్ ఆర్గనైజేషన్ (ENPO) ఈ ఆరు జిల్లాల ప్రజలను ఓటింగ్కి దూరంగా ఉండాలని పిలుపునిచ్చింది. దీంతో 4 లక్షల ఓటర్లున్న ఈ జిల్లాల్లో ఏ ఒక్కరూ ఓటింగ్లో పాల్గొనలేదు.
Similar News
News December 20, 2025
జనవరి నెలాఖరులోగా విశాఖకు TCS!

AP: ప్రముఖ IT సంస్థ TCS ఈ జనవరి నెలాఖరులోగా విశాఖలో ఏర్పాటు కానుంది. తొలుత 2 వేల మందితో తమ కార్యకలాపాలను ప్రారంభించనుంది. ఆపరేషన్స్ ప్రారంభించిన రోజే శాశ్వత భవనానికి శంకుస్థాపన చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 2027 చివరి నాటికి శాశ్వత క్యాంపస్ అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. TCS క్యాంపస్ కోసం రాష్ట్ర ప్రభుత్వం రుషికొండ ఐటీ పార్కులోని హిల్-3పై ఎకరానికి 99 పైసల చొప్పున 21.6 ఎకరాలను కేటాయించింది.
News December 20, 2025
దైవమే పాటించిన ధర్మం

శ్రీనివాసుడు పద్మావతిని వివాహం చేసుకోడానికి కుబేరుడి వద్ద అప్పు తీసుకున్నాడు. లోక నాయకుడైనప్పటికీ భూలోక నియమాలు పాటించి, పత్రం రాసిచ్చి, కలియుగాంతం వరకు వడ్డీ చెల్లిస్తానని మాటిచ్చారు. నేటికీ భక్తుల కానుకల రూపంలో ఆ రుణాన్ని తీరుస్తున్నారు. మనం ఎంత గొప్పవారమైనా సమాజ నియమాలను గౌరవించాలని, తీసుకున్న అప్పును బాధ్యతగా తిరిగి చెల్లించాలని, కష్టకాలంలో సాయం చేసిన వారి పట్ల కృతజ్ఞత ఉండాలని తెలుపుతుంది.
News December 20, 2025
అపరాల పంటల్లో బంగారు తీగ కలుపు నివారణ

అపరాల పంటలకు బంగారు తీగ కలుపు ముప్పు ఎక్కువ. అందుకే పంట విత్తిన వెంటనే ఎకరాకు 200L నీటిలో పెండిమిథాలిన్ 30% 1.25 లీటర్లను కలిపి పిచికారీ చేయాలి. వరి మాగాణిలో మినుము విత్తితే వరి పనలు తీసిన వెంటనే ఎకరాకు 1.25L పెండిమిథాలిన్ 30%ను 20KGల ఇసుకలో కలిపి పొలంలో చల్లాలి. అలాగే మినుము విత్తిన 20 రోజులకు ఎకరాకు 200 లీటర్ల నీటిలో ఇమజితాఫిర్ 10% 200mlను కలిపి పిచికారీ చేసి బంగారు తీగ కలుపును నివారించవచ్చు.


