News October 10, 2024
నన్ను చంపాలనుకున్నారనే ప్రచారం జరిగింది: సీఎం

AP: YCP హయాంలో అందరికంటే ఎక్కువ వేధింపులకు గురైంది తానేనని CM చంద్రబాబు అన్నారు. ‘నేను జైలులో ఉన్నప్పుడు నన్ను చంపేందుకు కుట్ర పన్నారనే ప్రచారం జరిగింది. జైలుపై డ్రోన్లు ఎగురవేశారు. CC కెమెరాలు పెట్టారు. దోమ తెర కూడా ఇవ్వలేదు. కక్ష తీర్చుకోవడం నా లక్ష్యం కాదు. సోషల్ మీడియాలో ప్రభుత్వంపై చేస్తున్న దుష్ప్రచారం ప్రజల దృష్టికి తీసుకెళ్తాం. మరీ మితిమీరితే ఏం చేయాలో నాకు తెలుసు’ అని వ్యాఖ్యానించారు.
Similar News
News October 22, 2025
BPT-2848 వరి పోషకాలను ఇలా అందించాలని ప్లాన్

బ్లాక్, రెడ్ రైస్ ధాన్యం పైపొరలో యాంతోసైనిన్ అనే పదార్థం వల్ల వాటికి ఆ రంగు వస్తుంది. ఈ పొరలో జింక్, ఐరన్, ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. BPT-2848లో ఈ పోషకాల శాతం చాలా ఎక్కువ. అందుకే ఈ రైస్ పౌడర్ను పిల్లలకు బేబీ ఫుడ్లా అందించేందుకు కంపెనీలు సిద్ధమవుతున్నాయి. ఉప్మారవ్వ, పౌడర్, జావ, పాయసం, కేకులు, అటుకులు, వడియాలు, సేమియా రూపంలోనూ ఈ రకాన్ని అందించాలని బాపట్ల వరి పరిశోధనాస్థానం ఇప్పటికే నిర్ణయించింది.
News October 22, 2025
డిజిటల్ ఇండియా కార్పొరేషన్లో ఉద్యోగాలు

డిజిటల్ ఇండియా కార్పొరేషన్ 16 పోస్టులకు వేర్వేరుగా నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి బీఈ, బీటెక్, ఎంబీఏ, డిగ్రీ, పీజీ( కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్, ఐటీ) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 10 పోస్టులకు అప్లైకి ఈ నెల 24 ఆఖరు తేదీ కాగా.. 6 పోస్టులకు ఈ నెల 28 లాస్ట్ డేట్. షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://dic.gov.in/
News October 22, 2025
ఇతిహాసాలు క్విజ్ – 43

1. జనకుని తమ్ముడి పేరు ఏంటి?
2. కుంతీ కుమారుల్లో పెద్దవాడు ఎవరు?
3. ఊర్ధ్వ లోకాలలో మొదటి లోకం ఏది?
4. విష్ణువు చేతిలో ఉండే చక్రం పేరు ఏమిటి?
5. దేవాలయాల్లో విగ్రహాలను ప్రతిష్ఠించేటప్పుడు వాటికి జీవం పోసే ఆచారం/వేడుకను ఏమంటారు?
– సరైన సమాధానాలు సాయంత్రం 6 గంటలకు పబ్లిష్ చేస్తాం.
<<-se>>#Ithihasaluquiz<<>>