News January 9, 2025
ఈ ఏడాది ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు ఉంటాయి: ప్రభుత్వం

AP: ఇంటర్ <<15096013>>ఫస్టియర్ పరీక్షల<<>> రద్దుపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఈ ఏడాది మార్చిలో జరిగే పబ్లిక్ పరీక్షల్లో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేసింది. ఫస్టియర్ పరీక్షలు కాలేజీలు నిర్వహించి, సెకండియర్ ఎగ్జామ్స్ బోర్డు నిర్వహించాలన్నది ప్రతిపాదనే అని తెలిపింది. జనవరి 26 వరకు విద్యార్థులు, తల్లిదండ్రుల సలహాలు, సూచనలు తీసుకుంటామని, ఆ తర్వాత తుది నిర్ణయం వెల్లడిస్తామని పేర్కొంది.
Similar News
News December 1, 2025
రేపు స్కూళ్లకు సెలవు ఉందా?

AP: దిత్వా తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ఇవాళ తిరుపతి, కడప, నెల్లూరు, అన్నమయ్య జిల్లాల్లోని స్కూళ్లు, కాలేజీలకు సెలవులిచ్చారు. అయితే తుఫాను బలహీనపడటంతో రేపటికి ఎలాంటి సెలవు ప్రకటనలు వెలువడలేదు. దీంతో యథావిధిగా విద్యాసంస్థలు కొనసాగనున్నాయి. తమిళనాడులో భారీ వర్షాలు కొనసాగుతుండటంతో చెన్నై, తిరువళ్లూరు, చెంగల్పట్టు జిల్లాల్లో స్కూళ్లకు సెలవు ప్రకటించారు. పలు యూనివర్సిటీల పరీక్షలను వాయిదా వేశారు.
News December 1, 2025
25,487 ఉద్యోగాలు.. అర్హతలివే

సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్లో 25,487 కానిస్టేబుల్(GD) ఉద్యోగాలకు <<18442408>>నోటిఫికేషన్<<>> విడుదలైంది. అర్హతలు: 01-01-2026 నాటికి 18-23ఏళ్ల వయసు(రిజర్వేషన్ బట్టి సడలింపు), టెన్త్ ఉత్తీర్ణత సాధించాలి. అప్లికేషన్ ఫీజు రూ.100. NCC ‘A’ సర్టిఫికెట్ ఉంటే 2%, NCC ‘B’కి 3%, NCC ‘C’కి 5% మార్కులను జత చేస్తారు. ఆన్లైన్ ఎగ్జామ్, PET, PST ఆధారంగా ఎంపిక చేస్తారు.
వెబ్సైట్: https://ssc.gov.in
News December 1, 2025
ఢిల్లీకి మంత్రి లోకేశ్.. రేపు కేంద్ర మంత్రులతో భేటీ

AP: మంత్రులు నారా లోకేశ్, వంగలపూడి అనిత ఢిల్లీ వెళ్లారు. వారికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీలు స్వాగతం పలికారు. రేపు పార్లమెంట్లో కేంద్ర మంత్రులు అమిత్ షా, శివరాజ్ సింగ్ చౌహాన్తో లోకేశ్, అనిత భేటీ కానున్నారు. మొంథా తుఫాను ప్రభావం వల్ల జరిగిన నష్టం అంచనా రిపోర్టును వారికి అందిస్తారు.


