News March 14, 2025
సంక్షేమ కార్యక్రమాల అమలులో వివక్ష ఉండదు: CM

AP: టీడీపీ నాయకులు ఏ స్థాయిలోనూ వైసీపీ నేతలతో సంబంధాలు పెట్టుకోకూడదని సీఎం చంద్రబాబు పార్టీ నేతలకు సూచించారు. తాను ఇలా చెబితే.. వైసీపీకి ఓటేసిన వారికి పథకాలు ఇవ్వొద్దన్నట్లు కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సంక్షేమ కార్యక్రమాల అమలులో వివక్ష ఉండదని స్పష్టం చేశారు. సంక్షేమ పథకాలు వేరు, రాజకీయ సంబంధాలు వేరని వ్యాఖ్యానించారు.
Similar News
News December 6, 2025
ఒంటిమిట్ట ఆలయ అభివృద్ధికి 50 ఏళ్ల మాస్టర్ ప్లాన్

ఒంటిమిట్ట ఆలయానికి 50 ఏళ్లకు సరిపడా అభివృద్ధికి సంబంధించి మాస్టర్ ప్లాన్ని రూపొందించాలని TTD EO అనిల్ కుమార్ సింగల్ అధికారులను ఆదేశించారు. TTD పరిపాలన భవనంలో ఆయన ఒంటిమిట్ట అధికారులతో శ్రీ కోదండరామస్వామి ఆలయ అభివృద్ధిపై సమీక్షించారు. భక్తుల తాకిడికి అనుగుణంగా అభివృద్ధి చేయాలని, అందులో మ్యూజియం, ఉద్యానవనాలు, చెరువులో జాంబవంతుని 108 అడుగుల విగ్రహం వంటి అనేక అభివృద్ధి పనులపై చర్చించారు.
News December 6, 2025
అరుణాచల ప్రదక్షిణకు HYD నుంచి ప్రత్యేక బస్సులు

అరుణాచలగిరి ప్రదక్షిణకు వెళ్లే భక్తుల కోసం HYD–2 డిపో DSNR నుంచి ప్రత్యేక బస్సులను RTC అందుబాటులోకి తెచ్చింది. బస్సులు DEC 12న రాత్రి 7 గంటలకు బయలుదేరి, కాణిపాకం–గోల్డెన్ టెంపుల్ మీదుగా అరుణాచలం చేరుతాయి. తిరుగు ప్రయాణం 14న మ.3గంటలకు ప్రారంభమై ఉ.8గంటలకు HYD చేరుకోనుందని HYD-2 డిపో మేనేజర్ కరుణశ్రీ తెలిపారు. ఒక్క టికెట్ ధర రూ.3,900 మరిన్ని వివరాలకు 9959444165 నంబర్లకు సంప్రదించాలన్నారు.
News December 6, 2025
అరుణాచల ప్రదక్షిణకు HYD నుంచి ప్రత్యేక బస్సులు

అరుణాచలగిరి ప్రదక్షిణకు వెళ్లే భక్తుల కోసం HYD–2 డిపో DSNR నుంచి ప్రత్యేక బస్సులను RTC అందుబాటులోకి తెచ్చింది. బస్సులు DEC 12న రాత్రి 7 గంటలకు బయలుదేరి, కాణిపాకం–గోల్డెన్ టెంపుల్ మీదుగా అరుణాచలం చేరుతాయి. తిరుగు ప్రయాణం 14న మ.3గంటలకు ప్రారంభమై ఉ.8గంటలకు HYD చేరుకోనుందని HYD-2 డిపో మేనేజర్ కరుణశ్రీ తెలిపారు. ఒక్క టికెట్ ధర రూ.3,900 మరిన్ని వివరాలకు 9959444165 నంబర్లకు సంప్రదించాలన్నారు.


