News March 14, 2025
సంక్షేమ కార్యక్రమాల అమలులో వివక్ష ఉండదు: CM

AP: టీడీపీ నాయకులు ఏ స్థాయిలోనూ వైసీపీ నేతలతో సంబంధాలు పెట్టుకోకూడదని సీఎం చంద్రబాబు పార్టీ నేతలకు సూచించారు. తాను ఇలా చెబితే.. వైసీపీకి ఓటేసిన వారికి పథకాలు ఇవ్వొద్దన్నట్లు కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సంక్షేమ కార్యక్రమాల అమలులో వివక్ష ఉండదని స్పష్టం చేశారు. సంక్షేమ పథకాలు వేరు, రాజకీయ సంబంధాలు వేరని వ్యాఖ్యానించారు.
Similar News
News December 11, 2025
విషాదం.. ఫ్రిజ్ పేలి తల్లి, కొడుకు మృతి

TG: ఫ్రిజ్ పేలి తల్లి, కొడుకు మృతిచెందిన ఘటన గద్వాల(D) ధరూర్లో జరిగింది. ఓ ఇంట్లో 2 రోజుల క్రితం ఫ్రిజ్ పేలగా ఇద్దరు మహిళలు, ఓ బాలుడు గాయపడ్డారు. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ఓ మహిళ, ఆమె కొడుకు చనిపోయారు. కాగా ఫ్రిజ్ను గోడకు 15-20cm దూరంలో ఉంచడం, క్లీన్ చేయడం, సరైన వెంటిలేషన్ ఉండేలా చూసుకోవడం, వైరింగ్, ప్లగ్స్ చెక్ చేయడం వంటి జాగ్రత్తలతో ఇలాంటి ఘటనలు నివారించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
News December 11, 2025
BELలో అప్రెంటిస్ పోస్టులు.. నేటి నుంచే దరఖాస్తుల ఆహ్వానం

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (<
News December 11, 2025
పెరుగన్నం నైవేద్యంతో ప్రయోజనాలు

కులదైవాలకు పెరుగన్నం నైవేద్యంగా పెడితే అప్పులు తీరిపోతాయని నమ్మకం. దీనికి దానిమ్మ గింజలు కలిపి సమర్పిస్తే శత్రు బాధలు తొలగి, తేజస్సు పెరుగుతుందని పండితులు చెబుతున్నారు. ‘ఇందులో ఎండు ఖర్జూరం కలిపి దానం చేస్తే డబ్బుకు సమస్య ఉండదు. మిరపకాయ, ఉప్పు కలిపి నైవేద్యంగా పెడితే గొడవలు, రోగాలు, అప్పులు దూరమవుతాయి. విష్ణు సహస్రనామం పఠించి దంపతులకు ఈ పెరుగన్నం దానం చేస్తే రోగ బాధలు తొలగిపోతాయి’ అని అంటున్నారు.


