News February 6, 2025

కరెంట్ ఛార్జీలు పెంచేది లేదు: సీఎం

image

AP: ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. కరెంట్ ఛార్జీలు పెంచేందుకు వీల్లేదని మంత్రివర్గ సమావేశంలో తేల్చి చెప్పారు. అవకాశం ఉంటే తగ్గించాలన్నారు. సూర్యఘర్, పీఎం కుసుమ్ వేగంగా అమలయ్యేలా ఆదేశాలు ఇవ్వాలని సూచించారు. నూతన విద్యాసంవత్సరం మొదలయ్యేలోపే డీఎస్సీ పోస్టులు భర్తీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

Similar News

News November 27, 2025

స్మోకింగ్, డ్రింకింగ్ కంటే ఒత్తిడి డేంజర్ అని తెలుసా?

image

స్మోకింగ్, డ్రింకింగ్ కంటే వేగంగా ఆయువును ఒత్తిడి హరిస్తుందని ఓ ఆర్థోపెడిక్ సర్జన్ తెలిపారు. ‘ఒత్తిడి కేవలం మానసిక సమస్య కాదని చాలామందికి తెలియదు. అది పూర్తి బాడీకి సంబంధించినది. ఒత్తిడికి గురైనప్పుడు శరీరం కార్టిసాల్, అడ్రినలిన్ రిలీజ్ చేస్తుంది. వెన్నునొప్పి, తలనొప్పి, పళ్లు కొరకడం, కండరాలు పట్టేయడం వంటి వాటికీ ఒత్తిడే కారణం’ అని చెప్పారు. 7-8 గంటల నిద్రతోనే ఒత్తిడిని ఎదుర్కోగలమన్నారు.

News November 27, 2025

పీరియడ్స్‌లో హెవీ బ్లీడింగ్ అవుతోందా?

image

పీరియడ్స్‌లో 1-3 రోజులకు మించి హెవీ బ్లీడింగ్ అవుతుంటే నిర్లక్ష్యం చేయకూడదంటున్నారు నిపుణులు. ఫైబ్రాయిడ్స్‌, ప్రెగ్నెన్సీ సమస్యలు, పీసీఓఎస్‌, ఐయూడీ, క్యాన్సర్ దీనికి కారణం కావొచ్చు. కాబట్టి సమస్య ఎక్కువగా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. దీన్ని గుర్తించడానికి రక్త పరీక్ష, పాప్‌స్మియర్‌, ఎండోమెట్రియల్‌ బయాప్సీ, అల్ట్రాసౌండ్‌ స్కాన్‌, సోనోహిస్టరోగ్రామ్‌, హిస్టరోస్కోపీ, D&C పరీక్షలు చేస్తారు.

News November 27, 2025

మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 30 ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

image

<>మెదక్ <<>>ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 30 కాంట్రాక్ట్ డిప్యూటీ మేనేజర్, జూనియర్ మేనేజర్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. అర్హతగల అభ్యర్థులు ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. పోస్టును బట్టి బీఈ, బీటెక్, ఎంటెక్, AMIE ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయసు 21 నుంచి 30ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.300. జీతం నెలకు రూ.30వేలు+IDA చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://ddpdoo.gov.in