News April 5, 2025

వక్ఫ్ బోర్డు పేరుతో భూ ఆక్రమణలు ఉండవు: యోగి ఆదిత్యనాథ్

image

వక్ఫ్ బోర్డు పేరుతో భూఆక్రమణలు చేయటం ఇక సాధ్యపడదని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యానించారు. UPలో లక్షల ఎకరాల భూమిని వక్ఫ్ పేరుతో ఆక్రమించారని ఆరోపించారు. ప్రభుత్వ భూములను ఆస్పత్రులు, కళాశాలలు వంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు వినియోగించవచ్చని పేర్కొన్నారు. ఈ బిల్లు తీసుకొచ్చినందుకు ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందిన సంగతి తెలిసిందే.

Similar News

News November 6, 2025

‘నీమాస్త్రం’ తయారీకి కావాల్సిన పదార్థాలు (1/2)

image

ప్రకృతి సేద్యంలోనూ చీడపీడల నివారణ ముఖ్యం. ఈ విధానంలో రసం పీల్చే పురుగులు, ఇతర చిన్న పురుగులు, పంటకు హాని కలిగించే కీటకాలతోపాటు శిలీంధ్రాల నివారణకు నీమాస్త్రం వాడతారు.
నీమాస్త్రం తయారీకి కావాల్సిన పదార్థాలు
☛ 5 కేజీల వేప గింజల పిండి లేదా 5 కేజీల వేప చెక్క పొడి లేదా 5 కేజీల వేప ఆకులు ☛ KG నాటు ఆవు లేదా దేశీ ఆవు పేడ ☛ 5 లీటర్ల నాటు ఆవు లేదా దేశీ ఆవు మూత్రం ☛ 100 లీటర్ల తాజా బోరు/బావి నీరు అవసరం.

News November 6, 2025

‘నీమాస్త్రం’ తయారీ, వినియోగం (2/2)

image

ముందు చెప్పిన పదార్థాలను ఒక సిమెంట్ తొట్టె/డ్రమ్ములో వేసి బాగా తిప్పాలి. 24 గంటలపాటు నీడలో పులియబెట్టాలి. గోనె సంచి కప్పిఉంచాలి. రోజుకు 2 సార్లు ఉదయం, సాయంత్రం 2 నిమిషాల పాటు కుడివైపునకు కలియతిప్పాలి. 24 గంటల తర్వాత పల్చటి గుడ్డలో వడపోయాలి. ఇదే నీమాస్త్రం. దీన్ని ఒక డ్రమ్ములో నిల్వచేసుకోవాలి. ఈ ద్రావణాన్ని నీటిలో కలపకుండా నేరుగా పంటలపై సాయంత్రం పూట పిచికారీ చేసుకోవాలి. వారం లోపు వాడేసుకోవాలి.

News November 6, 2025

మరో ఎన్‌కౌంటర్.. నలుగురు మావోయిస్టులు మృతి

image

ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. బీజాపూర్ జిల్లా తార్లగూడెం పరిధిలోని మరికెళ్ల అడవుల్లో భీకర ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. నిన్న తార్లగూడెం <<18207908>>ఎన్‌కౌంటర్‌లో<<>> ముగ్గురు మావోలు చనిపోయిన సంగతి తెలిసిందే.