News April 5, 2025
వక్ఫ్ బోర్డు పేరుతో భూ ఆక్రమణలు ఉండవు: యోగి ఆదిత్యనాథ్

వక్ఫ్ బోర్డు పేరుతో భూఆక్రమణలు చేయటం ఇక సాధ్యపడదని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యానించారు. UPలో లక్షల ఎకరాల భూమిని వక్ఫ్ పేరుతో ఆక్రమించారని ఆరోపించారు. ప్రభుత్వ భూములను ఆస్పత్రులు, కళాశాలలు వంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు వినియోగించవచ్చని పేర్కొన్నారు. ఈ బిల్లు తీసుకొచ్చినందుకు ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందిన సంగతి తెలిసిందే.
Similar News
News September 13, 2025
టాలీవుడ్ సంచలనం.. తేజా సజ్జ

కలిసుందాం రా, ఇంద్ర, ఠాగూర్, గంగోత్రి తదితర సినిమాల్లో బాలనటుడిగా ప్రేక్షకులకు సుపరిచితమైన తేజా సజ్జ వరుస హిట్లతో అదరగొడుతున్నారు. జాంబిరెడ్డి, హనుమాన్, తాజాగా ‘మిరాయ్’ మూవీతో సూపర్ హిట్లు అందుకున్నారు. ముఖ్యంగా దైవభక్తికి సంబంధించిన హనుమాన్, మిరాయ్ అతడికి ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి. ప్రస్తుతం ‘జై హనుమాన్’ చిత్రంలో నటిస్తున్నారు. తేజకు మంచి భవిష్యత్తు ఉందని నెటిజన్లు అభినందిస్తున్నారు.
News September 13, 2025
TODAY HEADLINES

*మంగళగిరిలో Way2News Conclave.. ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు
*మూడేళ్లలో 17 మెడికల్ కాలేజీలు రన్ అవుతాయి: CM చంద్రబాబు
*గుంటూరు-విజయవాడ మధ్య రాజధాని నిర్మిస్తాం: సజ్జల
*ఉపరాష్ట్రపతిగా CP రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం
*ఈనెల 15 నుంచి TGలో కాలేజీలు బంద్: FATHI
*AP లిక్కర్ కేసులో 10మంది నిందితులకు రిమాండ్ పొడిగింపు
*నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కి
*USలో భారతీయుడిని తల నరికి దారుణ హత్య
News September 13, 2025
ఆసియా కప్: ఒమన్పై పాకిస్థాన్ విజయం

ఆసియా కప్లో భాగంగా ఒమన్తో జరిగిన మ్యాచులో పాకిస్థాన్ 93 పరుగుల తేడాతో విజయం సాధించింది. పాక్ నిర్దేశించిన 161 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో ఒమన్ బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు. ఆ జట్టు 67 రన్స్కే ఆలౌట్ అయింది. హమద్ మీర్జా(27) టాప్ స్కోరర్గా నిలిచారు. పాక్ బౌలర్లలో అష్రఫ్, సుఫియాన్ ముకీమ్, సయీమ్ అయుబ్ తలో 2 వికెట్లతో రాణించారు.