News April 16, 2025
ఇక టోల్ గేట్లు ఉండవు: మంత్రి

జాతీయ రహదారులపై ఉండే టోల్గేట్స్ త్వరలోనే కనుమరుగవుతాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. వాహనాలు నెంబర్ శాటిలైట్ ట్రాకింగ్ ఆధారంగా వెహికిల్ ఓనర్ అకౌంట్లోనుంచి టోల్ ఛార్జ్ కట్ అయ్యేలా కొత్త టెక్నాలజీ తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఆ నూతన పాలసీ అమలుపై 15రోజుల్లో ప్రకటన వస్తుందని మంత్రి పేర్కొన్నారు. టోల్ గేట్ల వద్ద వాహనదారుల రద్దీ దృష్ట్యా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు.
Similar News
News November 15, 2025
ఈషాసింగ్కు CM రేవంత్ అభినందనలు

TG: కైరో(EGYPT)లో జరుగుతున్న ప్రపంచ షూటింగ్ ఛాంపియన్ షిప్లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ క్రీడాకారిణి ఈషాసింగ్కు CM రేవంత్ అభినందనలు తెలిపారు. ‘మహిళల 25 మీటర్ల ర్యాపిడ్ పిస్టల్ విభాగంలో అద్భుతమైన ప్రతిభ కనబరిచారు. షూటింగ్లో పట్టుదలతో సాధన చేస్తూ ఈషాసింగ్ ఎంతోమంది క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. భవిష్యత్తులో మరింతగా రాణించాలి’ అని ముఖ్యమంత్రి ఆకాంక్షించినట్లు CMO ట్వీట్ చేసింది.
News November 15, 2025
iBOMMA నిర్వాహకుడికి నెటిజన్ల సపోర్ట్.. ఎందుకిలా?

పోలీసులు అరెస్టు చేసిన iBOMMA నిర్వాహకుడికి మద్దతుగా నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. అధిక టికెట్ ధరలు పెట్టి సినిమా చూడలేని చాలా మందికి ఇటువంటి సైట్లే దిక్కంటున్నారు. OTT సబ్స్క్రిప్షన్ ధరలూ భారీగా ఉన్నాయని చెబుతున్నారు. అయితే అతడు చట్టవిరుద్ధమైన పైరసీతో ఇండస్ట్రీకి భారీగా నష్టం చేస్తున్నాడని, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి రూ.కోట్ల ఆదాయం పొందుతున్నాడని పోలీసులు చెబుతున్నారు. దీనిపై మీ COMMENT?
News November 15, 2025
పర్స్ అమౌంట్.. ఏ జట్టు దగ్గర ఎంత ఉందంటే?

వచ్చే ఐపీఎల్ సీజన్ కోసం ఆటగాళ్ల <<18297320>>రిటెన్షన్, రిలీజ్<<>> ప్రక్రియ పూర్తయ్యింది. త్వరలో జరిగే మినీ వేలం కోసం KKR వద్ద అత్యధికంగా రూ.64.3 కోట్లు, అత్యల్పంగా MI వద్ద రూ.2.75 కోట్ల పర్స్ అమౌంట్ మాత్రమే ఉంది. ఇక CSK(రూ.43.4 కోట్లు), SRH(రూ.25.5 కోట్లు), LSG(రూ.22.9 కోట్లు), DC(రూ.21.8 కోట్లు), RCB(రూ.16.4 కోట్లు), RR(రూ.16.05 కోట్లు), GT(రూ.12.9 కోట్లు), PBKS(రూ.11.5 కోట్లు) అమౌంట్ కలిగి ఉంది.


