News June 14, 2024
ఇక సినిమా రంగంపై ఎలాంటి ఆంక్షలు ఉండబోవు: మంత్రి కందుల

AP: చలనచిత్ర రంగ అభివృద్ధికి కృషి చేస్తానని పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేశ్ అన్నారు. సినిమాలపై ఇక ఎలాంటి ఆంక్షలు ఉండబోవని పేర్కొన్నారు. ఏపీని టూరిజం హబ్గా మారుస్తామని చెప్పారు. గత ప్రభుత్వంలో ఉన్నతాధికారులు సైతం అక్రమాలకు పాల్పడ్డారన్న ఆయన.. వారందరిపైనా చట్టప్రకారం చర్యలుంటాయని హెచ్చరించారు. ఈవీఎంలపై సీఎం జగన్, వైసీపీ నేతల మాటలు విడ్డూరంగా ఉన్నాయని ఎద్దేవా చేశారు.
Similar News
News November 3, 2025
ESICలో 94 పోస్టులు

ESIC ఫరీదాబాద్లో 94 సీనియర్ రెసిడెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. సంబంధిత విభాగంలో ఎండీ, డీఎన్బీ, ఎంఎస్ అర్హతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు ఈ నెల 7న ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 45ఏళ్లు. రిజర్వేషన్ గల వారికి ఏజ్లో సడలింపు ఉంది. దరఖాస్తు ఫీజు రూ.500, SC, STలకు ఫీజు లేదు. వెబ్సైట్: https://esic.gov.in/
News November 3, 2025
ఇలా చేస్తే తిరుమలలో వేగంగా దర్శనం!

శ్రీవారి దర్శనానికి ఎన్నో దారులున్నాయి. వీటిలో రక్తదానం చేసినవారికి ప్రత్యేక ప్రవేశ దర్శనం ఉంటుంది. రక్తదానాన్ని ప్రోత్సహించేందుకు దీనిని 1985లో ప్రారంభించినా చాలామందికి ఇది తెలియదు. రక్తదాతలకు రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్తో పాటు ఒక లడ్డూ & ప్రశంసాపత్రాన్ని అందిస్తారు. ఇందుకోసం కొండపై ఉన్న అశ్విని ఆస్పత్రిలో రోజూ పరిమిత వ్యక్తులు రక్తదానం చేసేందుకు తగిన ఏర్పాట్లు చేశారు. Share it
News November 3, 2025
వరల్డ్ కప్ విన్.. BJP&కాంగ్రెస్ శ్రేణుల ఫైట్

ప్రధాని మోదీ హాజరైతే అందులో భారత్కు ఓటమి తప్పదని కాంగ్రెస్ శ్రేణులు ట్వీట్లు చేస్తున్నాయి. ‘మోదీ హాజరైన చంద్రయాన్-2 & 2023 క్రికెట్ ప్రపంచకప్లో భారత్ విఫలమైంది. అదే మోదీ గైర్హాజరైన చంద్రయాన్-3, 2024 T20 WC, 2025 WWC వంటి వాటిలో భారత్ గెలిచింది. అంటే మోదీ హాజరుకు, వైఫల్యానికి సంబంధం ఉంది’ అని సెటైర్ వేస్తున్నాయి. రాహుల్ గాంధీ ఉండటం వల్లే కాంగ్రెస్ ఓడిపోతోందని బీజేపీ నేతలు కౌంటరిస్తున్నారు.


