News April 15, 2024

అధికారంలోకి వచ్చాక సంచలన నిర్ణయాలు ఉంటాయి: ఎంపీ లక్ష్మణ్

image

TG: బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చాక 100 రోజుల్లో సంచలన నిర్ణయాలు ఉంటాయని ఆ పార్టీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. ఉమ్మడి పౌరస్మృతిని దేశంలో కచ్చితంగా అమలు చేస్తామని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సూత్రధారులెవరో తేల్చాలని డిమాండ్ చేశారు. రేవంత్ పాలన టీవీ సీరియల్ ఎపిసోడ్‌లా మారిందని విమర్శించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ తోడు దొంగలేనని ఆరోపించారు.

Similar News

News February 9, 2026

పిల్లల్లో ఆకలి ఎందుకు తగ్గుతుందంటే?

image

పిల్లల్లో వయసుకు తగిన ఎదుగుదల లేకపోవడం, పాలు ఎక్కువగా తాగడం, చిరుతిళ్లు తినడం, నులిపురుగులు, ఐరన్ డెఫిషియన్సీ వల్ల ఆకలి తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. పిల్లలకు మంచి పౌష్టికాహారం, పండ్లు, సూప్స్‌ పెట్టాలి. జంక్‌ ఫుడ్‌ చిన్నప్పటి నుంచే అలవాటు చేస్తే ఊబకాయం, అనారోగ్యాలు వస్తాయి. ఫోన్లు, టీవీ చూపించి అన్నం పెట్టొద్దు. దీనితో అర్టిజం, హైపర్‌ యాక్టివ్‌ సమస్యలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

News February 9, 2026

ఎండిన మామిడి ఆకులు తోరణాలుగా ఉండకూడదా?

image

ఎండిన మామిడి ఆకులు గుమ్మానికి ఉండటం అశుభంగా భావిస్తారు. అవి నల్లగా మారినా వెంటనే తొలగించాలి. లేకపోతే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతుందని నమ్ముతారు. ఇంట్లో ప్రతికూలత ఏర్పడే అవకాశం ఉంటుందట. అందుకే ఎండిన తోరణాలను తొలగించి అవసరమైతే మూలా నక్షత్రం రోజున, ఇతర శుభ ముహూర్తాల్లో కొత్త పచ్చని మామిడి ఆకులను కట్టాలని సూచిస్తున్నారు. ఇలా చేస్తే ఇంటికి సానుకూల శక్తి చేకూరి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది.

News February 9, 2026

APPLY NOW: నేషనల్ సెంటర్ ఫర్ ఎర్త్ సైన్స్ స్టడీస్‌లో ఉద్యోగాలు

image

తిరువనంతపురంలోని నేషనల్ సెంటర్ ఫర్ ఎర్త్ సైన్స్ స్టడీస్ (NCESS)లో 3 జూనియర్ టెక్నీషియన్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. టెన్త్, ఐటీఐ అర్హతగల వారు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు జీతం రూ.18,000-రూ.56,900 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.ncess.gov.in