News October 27, 2024
ఈ జంతువులది అత్యంత బలమైన నోటి పట్టు!

ఒక్కో జంతువు నోటి పట్టుకు ఒక్కో శక్తి ఉంటుంది. దీన్నే బైట్ ఫోర్స్ అంటారు. ఈ శక్తిని కొలిచేందుకు PSI అనే కొలమానాన్ని వాడతారు. నైలు నదిలో ఉండే మొసళ్లకు అత్యధికంగా 5000 పీఎస్ఐ పవర్ ఉంటుంది. వాటి తర్వాత ఉప్పునీటి మొసళ్లు(3700 PSI), అమెరికా మొసళ్లు(2125), హిప్పోపొటమస్(1800), జాగ్వార్(1500), బుల్ షార్క్(1350), గొరిల్లా(1300), ధ్రువపు ఎలుగుబంటి(1200 PSI) ఉన్నాయి. మనిషి బైట్ ఫోర్స్ 162 పీఎస్ఐ మాత్రమే!
Similar News
News November 11, 2025
ఏపీ టుడే

* జిల్లా కేంద్రాల్లో మైనారిటీ సంక్షేమ దినోత్సవం.. విజయవాడలో రాష్ట్ర స్థాయి వేడుకలకు హాజరు కానున్న సీఎం చంద్రబాబు
* ప్రకాశం జిల్లా పీసీపల్లిలో 50 MSME పార్కులు వర్చువల్గా ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు
* ఇవాళ బాపట్ల, కోనసీమ జిల్లాల్లో పర్యటించనున్న కేంద్ర బృందం. మొంథా తుఫానుతో పంట నష్టం పరిశీలన
* శ్రీకాకుళంలోని ఎన్టీఆర్ మైదానంలో ‘సిక్కోలు పుస్తక మహోత్సవం’.. ఈ నెల 20 వరకు నిర్వహణ
News November 11, 2025
మంగళవారం రోజున ఇలా చేయకపోవడం ఉత్తమం

మంగళవారం హనుమంతుడికి ఎంతో ప్రీతిపాత్రమైనది. ఈరోజు మద్యం, మాంసాహారం, మత్తు పదార్థాలు సేవించకపోవడం ఉత్తమమని పండితులు చెబుతున్నారు. మంగళ దోషం తొలగిపోయే ఈరోజున బిచ్చగాళ్లు, పేదలు, వికలాంగులు, వృద్ధులను అవమానించకూడదని అంటున్నారు. ‘తల్లి, సోదరి, భార్య సహా స్త్రీలను దైవస్వరూపంగా భావించాలి. శివుడిని గౌరవించాలి. శివపూజలు చేయాలి. ఈ నియమాలు పాటిస్తే ఆంజనేయుడు తప్పక అనుగ్రహిస్తాడు’ అని సూచిస్తున్నారు.
News November 11, 2025
ఢిల్లీ పేలుడు వెనుక ఉగ్ర కుట్ర!

ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో <<18253113>>పేలుడు<<>>పై కొత్వాలి పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఉగ్రదాడిగా అనుమానిస్తూ ఉపా చట్టం సెక్షన్ 16, 18 కింద రిజిస్టర్ చేసినట్లు వెల్లడించారు. మరోవైపు పేలుడు నేపథ్యంలో పలు దేశాల ఎంబసీలు అప్రమత్తమయ్యాయి. ఎర్రకోట పరిసరాల్లో ఉండొద్దని తమ దేశ పౌరులకు భారత్లోని యూఎస్, ఫ్రాన్స్ ఎంబసీలు అడ్వైజరీ జారీ చేశాయి.


