News September 5, 2025

అవి ప్రజాపోరాటంలో ప్రత్యర్థులు పెట్టిన కేసులు: TDP

image

AP: మంత్రులందరిపై క్రిమినల్ కేసులున్నాయని YCP చేసిన <<17621813>>ట్వీట్‌పై<<>> TDP స్పందించింది. ప్రజాపోరాటాలు చేసే సమయంలో అధికారంలో ఉన్న ప్రత్యర్థులు ఈ కేసులు పెట్టారని పేర్కొంది. తన మీడియాలో జగన్ అసంబద్ధమైన వార్తలు ప్రచారం చేయిస్తున్నారని మండిపడింది. వీటి విషయం పక్కన పెడితే అసలు నేరాలు ఏంటో చూద్దామని.. సొంత బాబాయిని గొడ్డలితో నరికారని, దళితుడిని చంపి డోర్ డెలివరీ చేయడం వంటివి ప్రస్తావించింది.

Similar News

News September 5, 2025

హైదరాబాద్ వల్లే తెలంగాణ నంబర్‌వన్: చంద్రబాబు

image

AP: ఎంతో ఇష్టంతో తాను HYDను అభివృద్ధి చేశానని, దాని వల్లే TG నంబర్‌వన్‌గా నిలిచిందని CM చంద్రబాబు అన్నారు. అలాగే దేశంలో ఏపీని నంబర్‌వన్‌గా నిలిపేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. విజయవాడలో జరుగుతున్న టీచర్స్ డే కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. ‘ప్రపంచంలోనే తెలుగుజాతి నంబర్‌వన్‌గా నిలవాలి. రాబోయే 22 ఏళ్లపాటు మనమంతా దీనిపై దృష్టి సారిస్తే సాధ్యమే. విజన్ 2047 కోసం శ్రమిద్దాం’ అని ఆయన పిలుపునిచ్చారు.

News September 5, 2025

అందుకే VRO, VRAలను BRS తొలగించింది: CM రేవంత్

image

TG: ధరణి పేరిట ధన, భూదాహంతో BRS ప్రభుత్వం భూములన్నీ చెరబట్టిందని CM రేవంత్ విమర్శించారు. తమ దుర్మార్గాలు ప్రజలకు తెలియకూడదనే VRO, VRAలను తొలగించారన్నారు. ఎన్నికల ముందు ఎవరిని కదిలించినా ధరణి గురించే చెప్పేవారని, అందుకే దాన్ని బంగాళాఖాతంలో పడేస్తామన్న హామీని నెరవేర్చినట్లు చెప్పారు. ధరణితో పట్టుకున్న దరిద్రాన్ని భూభారతితో తొలగిస్తున్నామని GPO నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో అన్నారు.

News September 5, 2025

70 కేసులు వేసినా డీఎస్సీ ఆగలేదు: లోకేశ్

image

AP: ఇప్పుడున్న ఉపాధ్యాయుల్లో దాదాపు 80% మందిని CM చంద్రబాబే నియమించి ఉంటారని మంత్రి లోకేశ్ అన్నారు. ‘DSC అంటే చంద్రబాబు.. చంద్రబాబు అంటే DSC. 13 DSCల ద్వారా 1.80లక్షల మంది టీచర్లను చంద్రబాబే నియమించారు. 70 కేసులు వేసినా డీఎస్సీ మాత్రం ఆగలేదు. గత ప్రభుత్వంలో విచిత్రమైన పాలన చూశాం. ఉపాధ్యాయులను వైన్ షాపుల ముందు కాపలా పెట్టారు. జీతాలు కూడా సరిగ్గా ఇవ్వని పరిస్థితి’ అని లోకేశ్ ధ్వజమెత్తారు.