News January 11, 2025
మళ్లీ జన్ముంటుందని నమ్మే దేశాలివే!

చాలా ప్రాంతాల్లో మరణం తర్వాత మళ్లీ పుడతామని విశ్వసిస్తుంటారు. అలాంటి వారు అధికంగా ఉన్న దేశం బంగ్లాదేశ్. అక్కడ మొత్తం జనాభాలోని 98.8 శాతం మంది మరోసారి జన్మ ఉంటుందని నమ్ముతున్నట్లు వరల్డ్ వాల్యూస్ సర్వేలో వెల్లడైంది. ఆ తర్వాత మొరాకో (96.2%), లిబియా (95.2%), టర్కీ(91.8%), ఇరాన్(91.3%), పాకిస్థాన్ (89.3%), ఈజిప్ట్ (88.1%), ఫిలిప్పీన్స్(83.8%), నైజీరియా (83.1%) ఉన్నాయి.
Similar News
News February 1, 2026
APPLY NOW: NALCOలో ఉద్యోగాలు

నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ (<
News February 1, 2026
డాన్సర్స్, ఫ్యామిలీలకు రామ్చరణ్ బంపర్ ఆఫర్

గ్లోబల్ స్టార్ రామ్చరణ్ మరోసారి మంచి మనసు చాటుకున్నారు. టాలీవుడ్ డాన్సర్స్ అసోసియేషన్కు చెందిన దాదాపు 500 మంది మెంబర్స్, వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్కు ఫ్రీ హెల్త్ ఇన్సూరెన్స్ కల్పిస్తున్నారని తెలుస్తోంది. దీని కోసం ఆయన రూ.50లక్షల వరకు ఖర్చు చేస్తున్నట్టు సమాచారం. తన పుట్టినరోజు సందర్భంగా ఇచ్చిన మాటను రామ్చరణ్ నిలబెట్టుకున్నారని అభిమానులు చెబుతున్నారు. SMలో చెర్రీపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
News February 1, 2026
పశువులకు పోషకాలను అందించే అవిశ

అవిశ ఆకులు పశువులకు ముఖ్యంగా పాలిచ్చే వాటికి, మేకలకు అద్భుతమైన ఆహారమని వెటర్నరీ నిపుణులు చెబుతున్నారు. అవిశ ఆకుల్లో 25-30 శాతం ప్రొటీన్లు ఉంటాయి. పశువులకు సులభంగా జీర్ణమయ్యే మేత ఇది. పశువులు అవిశ ఆకులను చాలా ఇష్టంగా తిని అధిక పాల దిగుబడినిస్తాయి. అవిశ పిండి(అవిశ గింజల నుంచి నూనె తీసిన తర్వాత మిగిలిన పదార్థం)ని కూడా పశువులకు మేతగా ఉపయోగించవచ్చు. దీనిలో ప్రొటీన్లు, పోషకాలు, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి.


