News April 19, 2024

ఒక్కసారే ఎన్నిక జరిగిన అసెంబ్లీ సెగ్మెంట్లు ఇవే!

image

AP: నియోజకవర్గాల పునర్విభజన కారణంగా కొన్నిచోట్ల ఒక్కసారే ఎన్నికలు జరిగాయి. అవి.. పాచిపెంట, రామతీర్థం, బొద్దాం(విజయనగరం)-1962, హొంజరం-1952(శ్రీకాకుళం), కరప, కోరుకొండ(తూ.గో)-1962, అలంపురం(ప.గో)-1962, విజయవాడ(కృష్ణా)-1952, అమృతలూరు, గుంటూరు, బెల్లంకొండ, పల్నాడు(గుంటూరు)-1952, సిర్వేరు, మిడ్తూరు(కర్నూలు)-1955, యేర్పేడు(చిత్తూరు)-1962 ఉన్నాయి. విజయవాడ 3, గుంటూరు 2 సెగ్మెంట్లుగా మారింది. <<-se>>#ELECTIONS2024<<>>

Similar News

News October 24, 2025

ప్రమాదం జరిగిన బస్సుపై భారీగా జరిమానాలు

image

AP: కర్నూలు జిల్లాలో జరిగిన ప్రమాదంలో దగ్ధమైన బస్సుపై చాలా జరిమానాలు ఉన్నాయి. ఇటీవల ఓవర్ స్పీడ్, డేంజర్ స్పీడ్ చలాన్లు నమోదయ్యాయి. మొత్తం రూ.23 వేల వరకు ఫైన్లు ఉన్నాయి. వేమూరి కావేరి సంస్థకు చెందిన బస్సు డ్రైవర్లు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారనే దానికి ఈ జరిమానాలే నిదర్శనం. మరోవైపు ఈ బస్సుకు 2024 ఏప్రిల్‌లో ఇన్సూరెన్స్, గత మార్చిలో ఫిట్‌నెస్ వ్యాలిడిటీ ముగియడం గమనార్హం.

News October 24, 2025

బస్సు ప్రమాదం: మీకు హ్యాట్సాఫ్ బ్రదర్, సిస్టర్❤️

image

చిన్నటేకూరు వద్ద బస్సు ప్రమాద దుర్ఘటనలో ఇద్దరు దైవాల్లా ఆదుకున్నారు. ఆ సమయంలో అటుగా ప్రయాణించిన ఓ మహిళ వీడియో తీసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. తీవ్రత గుర్తించి అన్ని విభాగాలను వారు అప్రమత్తం చేసేలా ఆ వీడియో హెల్ప్ చేసింది. ఇక ఆ రూట్లో వెళ్లిన ఓ వ్యక్తి కార్లో ఆరుగురు క్షతగాత్రులను హుటాహుటిన కర్నూలు ఆస్పత్రిలో డ్రాప్ చేసి వెళ్లిపోయారు. ఆ ఇద్దరితో పాటు ఆపదలో ఆదుకున్న ప్రతి ఒక్కరికీ హ్యాట్సాఫ్❤️❤️

News October 24, 2025

భారత్ బంద్.. యథావిధిగా స్కూళ్లు

image

భారీ వర్షాలకు ఇవాళ ప.గో., ప్రకాశం జిల్లాల్లో, బాపట్ల జిల్లాలోని 5 మండలాల్లోని స్కూళ్లకు సెలవు ప్రకటించారు. నెల్లూరు, చిత్తూరు జిల్లాలకూ భారీ వర్షాలున్న నేపథ్యంలో తమకూ సెలవివ్వాలని విద్యార్థులు కోరుతున్నారు. మరోవైపు ఇవాళ భారత్ బంద్ కూడా కావడంతో స్కూళ్లకు సెలవు ఉంటుందని కొందరు భావించారు. కానీ, బంద్ ప్రభావం లేకపోవడంతో ఏపీ, టీజీలో పాఠశాలలు యథావిధిగా నడుస్తున్నాయి. మీ ప్రాంతంలో సెలవుందా? COMMENT.