News October 22, 2024
పార్లమెంట్ సభ్యులు పొందే ప్రయోజనాలు ఇవే
MPకి నెలకు రూ.1లక్ష జీతం లభిస్తుంది. వీటితో పాటు ఆయనకు మొబైల్ ఛార్జీల కింద ఏడాదికి రూ.1.5లక్షలు ఇస్తారు. ఏడాదికి 34 ఫ్లైట్ టికెట్స్ ఉచితం. ట్రైన్లో ఫస్ట్ క్లాస్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఏడాదికి ఉచితంగా 50వేల యూనిట్స్ విద్యుత్ & 4వేల కిలో లీటర్ల నీరు పొందొచ్చు. ప్రతినెలా రూ.62వేలు ఆఫీస్ అలవెన్స్, రూ.2లక్షలు హౌసింగ్ అలవెన్స్ వస్తాయి. పదవి పూర్తయ్యాక నెలకు రూ.25వేల పెన్షన్ వస్తుంది.
Similar News
News October 22, 2024
ఫ్రీ మీల్స్తో క్రియేటివిటీ, కోఆపరేషన్: సుందర్ పిచ్చాయ్
ఆఫీసులో ఫ్రీ మీల్స్ ఏర్పాటుతో ఉద్యోగుల్లో సృజనాత్మకత, సహకార ధోరణి పెరుగుతాయని ఆల్ఫాబెట్ CEO సుందర్ పిచ్చాయ్ అన్నారు. ఉద్యోగంలో చేరిన తొలి నాళ్లలో కేఫేలో ఇతరులతో చర్చల వల్ల పనిపట్ల ఉత్సుకత పెరిగి క్రియేటివిటీ పనితీరుకు దోహదం చేసేదని పేర్కొన్నారు. గూగుల్ కొత్త ఐడియాస్ సంస్థలోని కేఫే చర్చల్లో పుట్టుకొచ్చినవే అని వివరించారు. ఫ్రీ మీల్స్తో ఖర్చుల కంటే ప్రయోజనాలు ఎక్కువన్నారు.
News October 22, 2024
84 ఎకరాల భూకబ్జాకు యత్నం.. టాలీవుడ్ నిర్మాత అరెస్ట్
టాలీవుడ్ నిర్మాత బూరుగుపల్లి శివరామకృష్ణను HYD పోలీసులు అరెస్టు చేశారు. నకిలీపత్రాలతో రాయదుర్గంలో రూ.వేల కోట్ల విలువైన 84 ఎకరాల ప్రభుత్వ భూమిని కాజేసేందుకు ఆయన ప్రయత్నించినట్లు తేలింది. 20 ఏళ్లపాటు హైకోర్టు, సుప్రీంకోర్టులో వాదనలు కొనసాగాయి. ఆయన సమర్పించిన పత్రాలు నకిలీవని సుప్రీం తేల్చడంతో పోలీసులు కేసు పెట్టారు. ఈయన సీతారత్నంగారి అబ్బాయి, ప్రేమంటే ఇదేరా, యువరాజు, దరువు చిత్రాలను నిర్మించారు.
News October 22, 2024
తుఫాన్ ప్రభావం.. పలు రైళ్లు రద్దు
AP: తుఫాన్ దృష్ట్యా ఈస్ట్ కోస్ట్ పరిధిలో ఈ నెల 23, 24, 25 తేదీల్లో పలు రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే శాఖ తెలిపింది. 23న 18, 24న 37, 25న 11 రైళ్లను క్యాన్సిల్ చేసినట్లు పేర్కొంది. సికింద్రాబాద్-భువనేశ్వర్, కన్యాకుమారి-దిబ్రూగఢ్, చెన్నై సెంట్రల్-షాలిమార్, ముంబై-భువనేశ్వర్ కోణార్క్, హైదరాబాద్-హౌరా ఈస్ట్ కోస్ట్, బెంగళూరు-హౌరా తదితర రైళ్లు రద్దయ్యాయి.