News January 1, 2025
జేఈఈ మెయిన్స్ సెషన్-1 పరీక్ష తేదీలు ఇవే..

జేఈఈ మెయిన్స్ సెషన్-1 పరీక్ష తేదీలను ఎన్టీఏ ప్రకటించింది. జనవరి 22, 23, 24, 28, 29 తేదీల్లో పరీక్ష నిర్వహిస్తామని ప్రకటనలో తెలిపింది. ఉదయం 9 గంటల నుంచి మ.12 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండో సెషన్ పరీక్ష నిర్వహించనున్నారు. జనవరి 30న పేపర్ 2ఏ(బీఆర్క్), పేపర్-2బీ నిర్వహిస్తామని పేర్కొంది. రెండు విడతల్లో ఈ పరీక్ష జరగనున్న సంగతి తెలిసిందే.
Similar News
News December 22, 2025
మహిళలకు విజయ డెయిరీ పార్లర్ల నిర్వహణ!

TG: మహిళా సంఘాల సభ్యులకు ఇందిరా మహిళా శక్తి పథకం కింద విజయ డెయిరీ పార్లర్లను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మండలానికి ఒకటి, మున్సిపాలిటీకి 2చొప్పున మంజూరు చేయనున్నట్లు సమాచారం. త్వరలో విధివిధానాలు ఖరారు కానున్నాయి. సభ్యులు రూ.1,000 చెల్లించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా, స్థలం ఏర్పాటు అనంతరం రూ.5,000 చెల్లిస్తే పార్లర్ మంజూరు చేస్తారు. రూ.5 లక్షల వరకు ఖర్చు అవనుండగా సర్కార్ లోన్ ఇవ్వనుంది.
News December 22, 2025
నోటి పూత ఎలా తగ్గించాలంటే?

విటమిన్ లోపం, వాతావరణ మార్పుల వల్ల నోటి పూత వేధిస్తుంది. ఇది సాధారణంగా 2వారాల్లో తగ్గిపోతుంది. సమస్య ఎక్కువైతే తేనె, కొబ్బరి, పాల పదార్థాలు తినాలని సూచిస్తున్నారు నిపుణులు. అలాగే ఉప్పునీటిని పుక్కిలించడం, తులసి ఆకులు నమలడం, చల్లటి నీటితో నోరు శుభ్రం చేసుకోవడం, లవంగం నమలడం వల్ల కూడా సమస్య తగ్గుతుంది. వీటితోపాటు విటమిన్ లోపాన్ని నివారించడానికి వైద్యులను సంప్రదించి మాత్రలు వాడాలని సూచిస్తున్నారు.
News December 22, 2025
మీకు తెలుసా?.. ఆ ఊరిలో ఒక్కరే ఉంటారు!

ఒక ఊరికి ఒక్కరే రాజు, ఒక్కరే బంటు అంటే వినడానికి వింతగా ఉన్నా.. అమెరికాలోని ‘మోనోవి’లో ఇదే జరుగుతోంది. 89 ఏళ్ల ఎల్సీ ఐలర్ ఆ ఊరిలో ఏకైక నివాసి. ఏటా తనకు తానే ఓటు వేసుకుని మేయర్గా గెలుస్తారు. సెక్రటరీగా సంతకాలు చేస్తూ, తన హోటల్ కోసం తానే లైసెన్సులు ఇచ్చుకుంటారు. ఊరి మనుగడ కోసం పన్నులు చెల్లిస్తుంటారు. భర్త జ్ఞాపకార్థం ఒక లైబ్రరీ, ఒక హోటల్ నడుపుతూ పర్యాటకులను ఆకర్షిస్తున్నారు.


