News January 1, 2025
జేఈఈ మెయిన్స్ సెషన్-1 పరీక్ష తేదీలు ఇవే..

జేఈఈ మెయిన్స్ సెషన్-1 పరీక్ష తేదీలను ఎన్టీఏ ప్రకటించింది. జనవరి 22, 23, 24, 28, 29 తేదీల్లో పరీక్ష నిర్వహిస్తామని ప్రకటనలో తెలిపింది. ఉదయం 9 గంటల నుంచి మ.12 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండో సెషన్ పరీక్ష నిర్వహించనున్నారు. జనవరి 30న పేపర్ 2ఏ(బీఆర్క్), పేపర్-2బీ నిర్వహిస్తామని పేర్కొంది. రెండు విడతల్లో ఈ పరీక్ష జరగనున్న సంగతి తెలిసిందే.
Similar News
News December 20, 2025
KNR: ఎన్నికల విధులకు గైర్హాజరు.. 713 మందికి నోటీసులు

గ్రామ పంచాయతీ ఎన్నికల విధులకు గైర్హాజరైన 713 మంది ఉద్యోగులకు కరీంనగర్ జిల్లా నోడల్ అధికారి అశ్విని తానాజీ వాకడే షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మూడు విడతల్లో జరిగిన పోలింగ్కు పీఓ, ఏపీఓలుగా నియామకమైనా, ముందస్తు అనుమతి లేకుండా వీరు విధులకు రాలేదని పేర్కొన్నారు. ఎన్నికల నిబంధనల ఉల్లంఘనపై క్రమశిక్షణా చర్యలు ఎందుకు తీసుకోకూడదో లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
News December 20, 2025
అభివృద్ధి చిరునామా ORR.. ఇప్పుడు అమరావతి వంతు!

HYD అభివృద్ధిలో ఔటర్ రింగ్ రోడ్(ORR)ది కీలక పాత్ర. కనెక్టివిటీ పెరగడంతో నివాస, వాణిజ్య సముదాయాలు పెరిగాయి. ఇప్పుడు నూతనంగా ఎదుగుతున్న AP <<18624817>>రాజధాని<<>> అమరావతి ORRకు అడుగులు పడుతున్నాయి. ఇది పూర్తయితే 5 జిల్లాల పరిధిలో పారిశ్రామిక అభివృద్ధి, రియల్ ఎస్టేట్కు ఊపు వస్తుందనడంలో సందేహం లేదు. అయితే భూసేకరణకు ప్రజల సహకారం ఎలా ఉంటుంది? ఎప్పటికి పూర్తవుతుందనేదే ప్రశ్న!
News December 20, 2025
బడ్జెట్లో మీకేం కావాలి? ప్రభుత్వానికి సలహా ఇవ్వండి..!

కేంద్ర బడ్జెట్ 2026 కోసం భారత ప్రభుత్వం ప్రజల నుంచి సలహాలు కోరుతోంది. దేశాభివృద్ధికి, కొత్త రూల్స్ తయారీకి మీ ఐడియాలను పంచుకోవాలని MyGovIndia Xలో పోస్ట్ చేసింది. అందరికీ ఉపయోగపడేలా బడ్జెట్ ఉండాలనేది ప్రభుత్వ ప్లాన్. ఆసక్తి ఉన్నవారు <


