News January 1, 2025
జేఈఈ మెయిన్స్ సెషన్-1 పరీక్ష తేదీలు ఇవే..

జేఈఈ మెయిన్స్ సెషన్-1 పరీక్ష తేదీలను ఎన్టీఏ ప్రకటించింది. జనవరి 22, 23, 24, 28, 29 తేదీల్లో పరీక్ష నిర్వహిస్తామని ప్రకటనలో తెలిపింది. ఉదయం 9 గంటల నుంచి మ.12 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండో సెషన్ పరీక్ష నిర్వహించనున్నారు. జనవరి 30న పేపర్ 2ఏ(బీఆర్క్), పేపర్-2బీ నిర్వహిస్తామని పేర్కొంది. రెండు విడతల్లో ఈ పరీక్ష జరగనున్న సంగతి తెలిసిందే.
Similar News
News December 22, 2025
లేటెస్ట్ అప్డేట్స్ @9AM

* నేడు ఢిల్లీ హైకోర్టులో పవన్, జూనియర్ ఎన్టీఆర్ పిటిషన్లపై విచారణ.. అనుమతి లేకుండా తమ పేర్లు, ఫొటోలు వాడొద్దని పిటిషన్లు
* ఏపీలో కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నేటి నుంచి ట్రైనింగ్..
* పోలవరం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలంటూ నేడు మన్యం బంద్
* AP: పల్నాడు జిల్లాలో టీడీపీ సానుభూతిపరులైన అన్నాదమ్ముల దారుణ హత్య. నిందితులను పట్టుకోవాలని మంత్రి గొట్టిపాటి ఆదేశం
News December 22, 2025
996 పోస్టులు.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

SBIలో 996 కాంట్రాక్ట్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. మొత్తం పోస్టుల్లో HYDలో 43, అమరావతిలో 29 ఉద్యోగాలు ఉన్నాయి. VP వెల్త్, AVP వెల్త్, కస్టమర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి డిగ్రీ, MBA, CFP/CFA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: sbi.bank.in *మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.
News December 22, 2025
ACC ఛైర్మన్ నఖ్వీకి ఘోర అవమానం

ACC ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీకి మరోసారి ఘోర అవమానం జరిగింది. దుబాయ్లో జరిగిన U19 ఆసియా కప్ ఫైనల్లో పాక్ విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే మెడల్స్ అందించేటప్పుడు నఖ్వీ చేతుల నుంచి వాటిని తీసుకునేందుకు భారత ఆటగాళ్లు నిరాకరించారు. దీంతో రన్నరప్ మెడల్స్ను ICC అసోసియేట్ డైరెక్టర్ ముబాసిర్ ఉస్మానీ అందించారు. నఖ్వీ నుంచి ట్రోఫీ, మెడల్స్ <<18073064>>తీసుకోకపోవడం <<>>ఇది రెండోసారి.


