News January 28, 2025
WCలలో తొలి సెంచరీలు చేసిన మహిళా బ్యాటర్లు వీరే..

తెలంగాణలోని ఖమ్మంకు చెందిన గొంగడి త్రిష U19 T20 WCలో సెంచరీతో విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. 59 బంతుల్లోనే 110 రన్స్ చేసి నాటౌట్గా నిలిచారు. ఈ క్రమంలో మహిళల U19 T20 WCలో తొలి సెంచరీ చేసిన ప్లేయర్గా రికార్డు సృష్టించారు. ఉమెన్స్ ODI WCలో తొలి సెంచరీ ఇంగ్లండ్ ప్లేయర్ లిన్ థామస్(1973) నమోదు చేశారు. T20 WCలో మొదటి సెంచరీ వెస్టిండీస్ బ్యాటర్ డియాండ్రా డాటిన్(2010) పేరిట ఉంది.
Similar News
News November 28, 2025
అమరావతిలో 15 బ్యాంకులు.. 6541 ఉద్యోగాలు

AP: రాజధాని అమరావతిలో 15 బ్యాంకులు, బీమా సంస్థలు తమ <<18408811>>కార్యాలయాలు<<>> ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఇందుకోసం రూ.1,328 కోట్లు వెచ్చించనుండగా 6,541 ఉద్యోగాలు రానున్నాయి. సంస్థల జాబితా ఇదే.. APGB, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆప్కాబ్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, SBI, కెనరా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, BOB, ఇండియన్ బ్యాంక్, నాబార్డ్, PNB, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, IDBI, LIC, న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్.
News November 28, 2025
రోజుకు 30-35 లీటర్ల పాలు.. ఈ ఆవులతో డెయిరీఫామ్ మేలు

ప్రపంచంలోనే అత్యధికంగా పాలిచ్చే ఆవు జాతుల్లో హోలిస్టిన్ ఫ్రీజియన్ ఒకటి. వివిధ వాతావరణ పరిస్థితులను తట్టుకొని ఒక ఈతలో 9వేల లీటర్లకు పైగా పాలు ఇస్తాయి. ఇవి రోజుకు కనీసం 25-30 లీటర్లు, కొన్ని సందర్భాల్లో 35-40 లీటర్ల వరకు పాలు ఇస్తాయి. పాలలో కొవ్వు 3.5%గా, ప్రొటీన్ 3.1%గా ఉంటుంది. ఈ రకం ఆవులతో డెయిరీఫామ్ నిర్వహణ మేలంటున్నారు వెటర్నరీ నిపుణులు. మరింత సమాచారానికి <<-se_10015>>పాడిపంట <<>>క్లిక్ చేయండి.
News November 28, 2025
అవసరమైతే కోర్టులో మూలన నిలబెట్టగలం.. రంగనాథ్పై HC తీవ్ర ఆగ్రహం

TG: అంబర్పేట బతుకమ్మ కుంట వ్యవహారంలో విచారణకు హాజరుకాకపోవడంపై హైడ్రా కమిషనర్ రంగనాథ్పై HC ఆగ్రహించింది. న్యాయస్థానం ఉత్తర్వులపై గౌరవం లేదా అని ప్రశ్నించింది. అవసరమైతే ఉ.10.30 గంటల నుంచి సా.4.30 గంటల వరకు కోర్టులో ఓ మూలన నిలబెడతామని ఘాటు వ్యాఖ్యలు చేసింది. బతుకమ్మ కుంట భూవివాదం కొనసాగుతుండగానే పనులు చేపట్టారంటూ కోర్టు ధిక్కరణ పిటిషన్పై విచారణ సందర్భంగా ఈ కామెంట్స్ చేసింది.


