News September 5, 2024

FY2024లో అత్యధిక పన్ను చెల్లించిన క్రికెటర్లు వీరే

image

2023-24 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక పన్ను చెల్లించిన క్రికెటర్ల జాబితాను ఫార్చ్యూన్ ఇండియా విడుదల చేసింది. రూ.66 కోట్లతో విరాట్ కోహ్లీ ఆ లిస్ట్‌లో అగ్రస్థానంలో ఉన్నారు. ఇక ఆయన తర్వాతి స్థానాల్లో మహేంద్ర సింగ్ ధోనీ(రూ.38 కోట్లు), సచిన్ టెండూల్కర్(రూ.28 కోట్లు), సౌరవ్ గంగూలీ(రూ.23 కోట్లు), హార్దిక్ పాండ్య(రూ.13 కోట్లు), రిషభ్ పంత్ (రూ.10 కోట్లు) ఉన్నారు.

Similar News

News February 3, 2025

అలాగైతే.. పులివెందులకు ఉపఎన్నిక: RRR

image

AP: MLA ఎవరైనా లీవ్ అడగకుండా 60 రోజులు అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు పడుతుందని Dy. స్పీకర్ రఘురామ‌కృష్ణరాజు(RRR) హెచ్చరించారు. ఒకవేళ మాజీ CM జగన్ అసెంబ్లీకి రాకపోతే పులివెందులకు ఉపఎన్నిక వస్తుందని చెప్పారు. ఆయన అసెంబ్లీకి వచ్చి తన మనోభావాలు పంచుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ప్రతిపక్ష హోదాను స్పీకర్, CM కాదు ప్రజలు ఇవ్వాలని తెలిపారు. తన కస్టోడియల్ కేసులో సునీల్ కుమార్ పాత్ర స్పష్టమైందన్నారు.

News February 3, 2025

మరోసారి థియేటర్లలోకి క్లాసిక్ సూపర్ హిట్

image

టాలీవుడ్‌ ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ సూపర్ హిట్ మూవీ అయిన ‘గోదావరి’ మరోసారి థియేటర్లలో విడుదల కానుంది. శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈ క్లాసిక్ మూవీ మార్చి 1న రీరిలీజ్ కానుంది. ఈ చిత్రంలో సుమంత్, కమలిని ముఖర్జీ జంటగా నటించగా.. ఇందులోని పాటలు ఇప్పటికీ ఎంతో మందికి ఫేవరెట్. మూవీలోని ‘సీతా మహాలక్ష్మి’ పాత్రకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. మరి ‘గోదావరి’ చూసేందుకు థియేటర్లకు వెళ్తున్నారా? లేదా? కామెంట్ చేయండి.

News February 3, 2025

17% పెరిగిన జీఎస్టీ ఆదాయం

image

తెలంగాణలో జీఎస్టీ, వ్యాట్ రాబడులు పెరిగాయి. జనవరిలో ఏకంగా 17 శాతం జీఎస్టీ ఆదాయం పెరిగింది. 2024 జనవరిలో రూ.3351.88 కోట్ల జీఎస్టీ వసూలు కాగా, ఈ ఏడాది JANలో రూ.3921.68 కోట్లు వచ్చాయి. గత 10 నెలల్లో జీఎస్టీ, వ్యాట్ కింద రూ.62858.55 కోట్లు వసూలు అయ్యాయి.