News May 5, 2024

రాష్ట్రంలో అత్యంత సమస్యాత్మక నియోజకవర్గాలు ఇవే

image

AP: రాష్ట్రంలోని అత్యంత సమస్యాత్మక నియోజకవర్గాలను ఎన్నికల సంఘం గుర్తించింది. మొత్తం 14 సెగ్మెంట్లను అత్యంత సమస్యాత్మక నియోజకవర్గాలుగా ప్రకటించింది. మాచర్ల, వినుకొండ, గురజాల, పెదకూరపాడు, ఒంగోలు, ఆళ్లగడ్డ, తిరుపతి, చంద్రగిరి, విజయవాడ సెంట్రల్, పుంగనూరు, పలమనేరు, పీలేరు, రాయచోటి, తంబళ్లపల్లె నియోజకవర్గాలు ఇందులో ఉన్నాయి. ఈ 14 సెగ్మెంట్లలో CRPFతోపాటు రాష్ట్ర పోలీసుల బలగాలు భారీగా మోహరించనున్నాయి.

Similar News

News December 22, 2025

నేటి ముఖ్యాంశాలు

image

✸ CBN, BJPతో కలిసి తెలంగాణకు కాంగ్రెస్ అన్యాయం: కేసీఆర్
✸ GP ఎన్నికల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత కనిపించింది: KCR
✸ ఉమ్మడి ఏపీ కంటే కేసీఆర్ వల్లే ఎక్కువ అన్యాయం: రేవంత్
✸ ప్రజలకు కేసీఆర్ క్షమాపణలు చెప్పాలి: ఉత్తమ్
✸ జగన్‌కు చంద్రబాబు, పవన్, కేసీఆర్ విషెస్.. థాంక్స్ చెప్పిన YCP చీఫ్
✸ U-19 ఆసియాకప్ ఫైనల్లో పాకిస్థాన్ చేతిలో భారత్ ఓటమి
✸ తెలుగు బిగ్‌బాస్ సీజన్-9 విజేతగా కళ్యాణ్ పడాల

News December 22, 2025

రెండో పెళ్లిపై మారుతున్న దృక్పథం

image

భారతీయుల్లో రెండో పెళ్లిపై అభిప్రాయాలు వేగంగా మారుతున్నాయి. రీబౌన్స్ మ్యాచ్‌మేకింగ్ యాప్ నిర్వహించిన తాజా సర్వేలో విడాకులు తీసుకున్న వారిలో 28% మంది మళ్లీ పెళ్లికి సిద్ధమని వెల్లడించారు. గతం తమ భవిష్యత్తును డిసైడ్‌ చేయకూడదని వారు భావిస్తున్నారు. ఈ మార్పులో మహిళలే ముందుండటం గమనార్హం. ముఖ్యంగా మెట్రో నగరాల్లో ఈ ఆలోచనా ధోరణి ఎక్కువగా కనిపిస్తోంది. సమాజంలో మారుతున్న ఈ ఆలోచనా విధానంపై మీ Comment?

News December 22, 2025

తండ్రైన భారత క్రికెటర్

image

టీమ్ ఇండియా క్రికెటర్ శార్దూల్ ఠాకూర్ దంపతులు మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆయన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ‘బేబీ బాయ్‌కి స్వాగతం. 9 నెలలుగా నీ రాక కోసం ఎదురుచూస్తున్నాం’ అంటూ రాసుకొచ్చారు. కాగా 2023 ఫిబ్రవరి 27న మిథాలీ పారూల్కర్‌ను శార్దూల్ పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం జాతీయ జట్టులో చోటు కోల్పోయిన ఆయన దేశవాళీ క్రికెట్‌లో ముంబైకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.