News September 12, 2024

గతనెల ఎక్కువ మంది చూసిన వెబ్‌సైట్స్ ఇవే..

image

దేశంలో ఆగస్టు-2024లో అత్యధిక మంది వీక్షించిన వెబ్‌సైట్ల జాబితాను ‘సిమిలర్‌ వెబ్’ విడుదల చేసింది. తొలి స్థానంలో గూగుల్ ఉండగా రెండో స్థానంలో యూట్యూబ్ నిలిచింది. ఆ తర్వాత ప్లేసుల్లో ఎక్స్ హమ్‌స్టర్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ఉన్నాయి. ఇక గ్లోబల్ వైడ్‌గానూ 83.5 బిలియన్ విజిట్స్‌తో గూగుల్ టాప్ ప్లేస్ దక్కించుకుంది. ఆ తర్వాత యూట్యూబ్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, x.com, వాట్సాప్ ఉన్నాయి.

Similar News

News August 28, 2025

అమెరికా టారిఫ్స్.. భారత్ ప్లాన్ ఇదే!

image

అమెరికా 50% టారిఫ్స్ అమల్లోకి రావడంతో భారత్ ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టింది. ఎగుమతులను 40 దేశాలకు విస్తరించాలని ప్లాన్ చేస్తోంది. యూకే, సౌత్ కొరియా, జపాన్, ఆస్ట్రేలియా, యూరోపియన్ దేశాలకు డైమండ్స్, టెక్స్‌టైల్, లెదర్, సీ ఫుడ్ సహా ఇతర వస్తువులను ఎగుమతి చేయాలని భావిస్తోంది. భారత వస్తువుల క్వాలిటీ బాగుంటుందని, నమ్మకమైన ఎగుమతిదారు అని విదేశాల్లో విశ్వసనీయత ఉండటంతో దాన్ని వాడుకోవాలని యోచిస్తోంది.

News August 27, 2025

ఈ జిల్లాల్లో రేపు విద్యాసంస్థలకు సెలవు

image

TG: భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు రేపు సెలవు ప్రకటించారు. కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, నిర్మల్, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు రేపు సెలవు ఉండనుంది. మిగతా జిల్లాల్లోనూ సెలవు ఇవ్వాలని తల్లిదండ్రులు, విద్యార్థులు కోరుతున్నారు. మీ జిల్లాలో వర్షం పడుతోందా? కామెంట్ చేయండి.

News August 27, 2025

గోదావరి పరీవాహక ప్రజలు జాగ్రత్త!

image

TG: గోదావరి నదిపై నిజామాబాద్ జిల్లాలో ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద భారీగా పెరిగే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ప్రస్తుతం 2 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా అది 4 లక్షల నుంచి 5 లక్షల క్యూసెక్కులకు పెరిగే అవకాశం ఉందన్నారు. మంజీరా నది వరద అంతా SRSPలోకి రానుంది. అటు కడెం ప్రాజెక్టుకు వరద పోటెత్తడంతో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సైతం ప్రవాహం పెరగనుంది.