News October 9, 2025
భారత్ నుంచి నోబెల్ అందుకున్నది వీరే..

<<17948949>>నోబెల్<<>> పురస్కారం అందుకున్న తొలి భారతీయుడిగా రవీంద్రనాథ్ ఠాగూర్(1913-సాహిత్యం) నిలిచారు. 1930లో సి.వి.రామన్(ఫిజిక్స్), 1979లో మదర్ థెరిసా(శాంతి), 1998లో అమర్త్యసేన్(అర్థశాస్త్రం), 2014లో కైలాశ్ సత్యార్థి(శాంతి) ఈ జాబితాలో ఉన్నారు. భారత సంతతి వారిలో హరగోవింద్ ఖొరానా(వైద్యశాస్త్రం), సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్(ఖగోళ భౌతిక), వెంకట్రామన్ రామకృష్ణన్(రసాయన), అభిజిత్ బెనర్జీ(అర్థశాస్త్రం) ఉన్నారు.
Similar News
News October 9, 2025
గడువులోపు ఆమోదం తెలపకపోతే చట్టంగా భావిస్తాం: ఏజీ

TG: బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై విచారణలో ప్రభుత్వం బలంగా వాదనలు వినిపిస్తోంది. ఈ బిల్లును గవర్నర్, రాష్ట్రపతికి పంపినా ఆమోదం తెలపలేదని AG సుదర్శన్ రెడ్డి HCకి గుర్తు చేశారు. దీంతో తమిళనాడు కేసును ఉదాహరణగా పేర్కొంటూ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం బీసీ బిల్లు ఆమోదం పొందినట్లేనని స్పష్టం చేశారు. గవర్నర్/రాష్ట్రపతి గడువులోపు బిల్లును ఆమోదించకపోతే చట్టంగా భావించాల్సి ఉంటుందన్నారు.
News October 9, 2025
ప్రజలను రెచ్చగొట్టేందుకే జగన్ బలప్రదర్శన: సత్యకుమార్

AP: నర్సీపట్నం పర్యటనకు కారణమేంటో వైసీపీ చీఫ్ జగన్ స్పష్టంగా చెప్పాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రశ్నించారు. ప్రజలను రెచ్చగొట్టేందుకు బలప్రదర్శన చేస్తున్నారని దుయ్యబట్టారు. గతంలో ఆయన పర్యటనలు ఎలా సాగాయో చూశామన్నారు. మెడికల్ కాలేజీలపై జగన్కు ఎలాంటి చిత్తశుద్ధి లేదని ఫైరయ్యారు. వికృత మనస్తత్వం ఉన్న జగన్కు ఏపీ అభివృద్ధి ఇష్టం లేదని మంత్రి విమర్శించారు.
News October 9, 2025
BC రిజర్వేషన్లు: హైకోర్టులో వాదనలు ఇలా..

TG: BCలకు 42% రిజర్వేషన్లు కల్పించడంపై దాఖలైన పిటిషన్లపై HCలో విచారణ కొనసాగుతోంది. ప్రభుత్వం తరఫున AG సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపిస్తున్నారు. BC కులగణన చేయాలని క్యాబినెట్ నిర్ణయించిందన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసిందని చెప్పారు. డోర్2డోర్ సర్వేకు అన్ని పార్టీలూ మద్దతిచ్చినట్లు తెలిపారు. సర్కార్ నియమించిన సీనియర్ లాయర్ సింఘ్వీ వర్చువల్గా వాదిస్తున్నారు.